పుట:Dashavathara-Charitramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

నీరాకరము లెల్ల క్షీరాకరము లయ్యెఁ దటినులు గీర్వాణతటిను లయ్యె
ధేను లెల్లను గ్రామధేనువు లయ్యెను మ్రాఁకులు దెఱగంటి మ్రాఁకు లయ్యె
నగము లెల్లఁ దుషారనగము లయ్యెను బన్న గంబులు దొలిపన్నగంబు లయ్యె
మునులెల్ల నారదమును లైరి గగనవిహారులు భుజగేంద్రహారు లైరి


తే.

యౌర మగదల వంశరత్నాకరాధి, నాథచంద్రాదినారాయణప్రధాన
చంద్రనిస్తంద్రతరకీర్తిసాంద్రరుచులు, మించి లోకత్రయం బాక్రమించుకతన.

59


తే.

అనఘుఁ డయ్యాదినారాయణార్యమౌళి, ఘనుఁడు రాచూరి వేంకటేంద్రునకుఁ గోన
మకును సుతయైన తిమ్మాజమను వరించి, కనియె భాస్కరదాసాదితనుజమణుల.

60


ఉ.

హాటకదాతయౌ మగదలాధిపకృష్ణునిదానవాహినీ
ఝాటము చేత నుబ్బుచును సర్వజనస్తవనీయత న్నిరా
ఘాటగభీరతాగుణము గాంచిన స్రుక్కుచునుండఁగాఁ జుమీ
పోటును బాటునంచు జనము ల్గణియించును వారిరాశికిన్.

61


తే.

గరిమ నఱువదినాలుగుకళలఁ బొసఁగి, యెసఁగు మగదల కృష్ణమంత్రీంద్రవదన
మునకుఁ బదియాఱుకళలచేఁ దనరునబ్జ, మండలము జోడె పాదాభ నుండుఁగాక.

62


సీ.

అమరంగఁ దా నంబరము గప్పుకొను నెట్టు కవుల కీయఁడు మేఘుఘనత యెంత
తాను రత్నోర్మిక ల్దాల్చు నెవ్వనికీఁడు పాథోధినాథుని ప్రభుత యెంత
గంధంబు గను నొసంగదు ద్విజశ్రేణికిఁ గల్పవృక్షము కల్పకత్వ మెంత
సుమనోవతంస మౌచును బుణ్యజనుల కీ దనిమిషేంద్రమణిరాతన మదెంత


తే.

భువిఁ జతుర్విధశృంగారములు సమిత్ర, బంధుకవిధీరజనముగాఁ బ్రౌఢి మీఱఁ
బూను మగదల కృష్ణప్రధానభాను, నిరుపమౌదార్యలీల వర్ణించువేళ.

63


మ.

తలపం గర్ణుఁ డపార్థదాతయె యపాత్రత్యాగిమూర్ధన్యుఁ డా
బలి వ్యర్థంబగు గల్పకంబు ఫలియింప న్మేఘుఁడుం దారవో
తలమాత్రంబు ధనం బొసంగఁడు గదా తద్దానము ల్మెత్తునే
యలఘుప్రౌఢిదుఁ బద్మనాభఘను కృష్ణామాత్యుఁ గీర్తింపుచోన్.

64


సీ.

రాజరాజసుహృద్ధరాజరాజముఖీవిరాజరాజన్ముఖప్రభల నేలి
పారిజాతకపాదపారిజాతరిపుద్విపారిజాత[1]శ్రీలఁ బ్రతిఘటించి
హరికాండగంగాలహరికాండజకులేంద్రహరికాండదీప్తుల నతకరించి
ఘనసారశారదఘనసారసజవాహఘనసారకాంతులఁ గడకుఁ దఱిమి


తే.

కలశజలనిధిహలధరజలజతుహిన, విమలమలయజసురగజవిశదకమల
కుముదసముదయధవళిమరమణఁ దాల్చి, యెసఁగె మగదల కృష్ణమంత్రీంద్రుకీర్తి.

65


సీ.

తల్లిదండ్రులు ముకుందద్రోహు లంచును బాథోధిలోపలఁ బ్రభవ మొంది
పాథోధిలోపలఁ బ్రభవింపఁ బంకజాతావాసయై క్షితి నవతరించి

  1. శ్రీలనవఘళించి