పుట:Dashavathara-Charitramu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అని యత్యంతదురంతచింత మునిరా జౌర్వానలజ్వాలికా
ఘనసంతాపపరిప్లవన్మకరనక్రగ్రాహమీనాదిజం
తునికాయాభ్రనదీనివాసకరుణోద్యుక్తోర్మికాహస్తమై
కననౌవార్ధి గుభిల్లునం దుమికె నక్రస్ఫూర్తి వర్తిల్లఁగన్.


చ.

దుముకి మునీంద్రనందనుఁడు తోడనె వారుణభృత్యు లెందఱే
సమధికభక్తిఁ జేరి కడుచక్కనిమార్గము సూపఁగా నుపా
యమున నగాళికోసరిలి యయ్యమరావతి సేరివచ్చు సం
యమి యమితప్రభావమున కప్పతి విస్మయ ముప్పతిల్లఁగన్.

17


క.

ఎదురుగ వచ్చి మునీంద్రుని, పదములు పన్నీటఁ గడిగి బంగరువిరుల
న్సదమల భయభక్తులు మదిఁ, బొదలం బూజించి యతని బొగడుచు ననియెన్.

18


శా.

సామాన్యుండె భవద్గురుండు భృగుఁ డక్షయ్యప్రభావాఢ్యుఁ డై
యామూర్తిత్రయిచేతఁ బూజగొనె నింద్రాదు ల్భవత్కింకరు
ల్నీమాహాత్మ్యము కొంచెమే కలిగెఁగా నీపాదము ల్గొల్వఁగా
నే ము న్నేమితపంబు చేసితినొకో భృగ్వాన్వయగ్రామణీ.

19


వ.

అనిన వరుణు వినీతవృత్తికి వినీతప్రాప్తి యగునని సంతసిల్లి మునివల్లభుం డిట్ల
నియె.

20


మ.

చెవి నల్పుం దనువెల్లఁ దెల్పుగల తేజు ల్వేయిటిం గోరి నే
ధవళైకాశ్వుని మేషవాహనుని గంధర్వద్విషద్వాహు మా
నవవాహు న్నిరసించి కాండపతిని న్యాచింపఁగా వచ్చితి
న్భువనాధీశ్వర యిచ్చిపంపుము శుభంబు ల్నీకు జేకూరెడిన్.

21


మ.

అనిన న్భాగ్యము చేసితి న్మునికులాధ్యక్షా సహస్రాశ్వము
ల్గొను నే నిచ్చెద నంచు నట్టి వొసఁగన్ క్షోణీసురేంద్రుండు గ్ర
క్కన గంగానదిత్రోవగా వెడలెఁ దత్కంఖాణజాతంబునం
దనరారెన్ హయతీర్థ మన్నదినిఁ గన్యాకుబ్జపార్శ్వంబునన్.

22


క.

జటివరుఁ డిటువలె గంగా, తటిని గృపీటముల వెడలి తతఘోరఖురా
స్ఫుటితధరాచటులరజః, పటలారుణితాంశుఁ డగుచుఁ బఱతెంచుటయున్.

23


చ.

పరనృపుఁ డెవ్వఁడో పురముపైఁ జనుదెంచెనటంచు గాధీభూ
వరుఁడు మహారథద్విరదబంధుపదాతులతోడఁ గూడి ము
ద్గరకరవాలతోమరగదాపరిఘక్షురికాదిసాధనో
త్కరము వెలుంగఁ బెట్టెదురఁ గన్గొని డగ్గఱి విప్రుఁ డిట్లనున్.

24


శా.

మామా తెచ్చితి వేయిగుఱ్ఱములు కొమ్మా నాకు నీకన్య ని
మ్మా మాట ల్వెయియేల యంచనిన గోత్రాధీశుఁ డౌరౌర ని