పుట:Dashavathara-Charitramu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

రతిపతియహితునిసతి భా, రతి జతయై కంకణము లొరయ ముత్తెపుటా
రతియెత్తిరి వామనునకు, రతిబోఁటుల పాట తేట ఱాలు గరంగన్.

78


మ.

పరమేశాన పయోజసంభవులు దిక్పాలుర్ క్రమం బొప్పఁగాఁ
బరమాహ్లాదము మీఱ నొండొరులు పైపై నిచ్చుపట్టాంశుకా
భరణశ్రేణులు కేలఁ గైకొని సభాభాగంబున న్నిల్చి సు
స్వరుఁడై దేవగురుండు వీఁడు చదివె న్సర్వాగమస్ఫూర్తులన్.

79


వ.

ఇవ్విధంబునఁ గశ్యపబ్రహ్మ సకలబ్రహ్మర్షిసమేతుండై తనూజాతు నుపనీతుం
గావించి దిగంతరాగతశిష్టజనవ్రాతంబుల నభీష్టమృష్టాన్నంబుల దక్షిణ
తాంబూలంబుల సంతుష్టులం జేయుచు మహోత్సవదినచతుష్టయంబు గడపె
నంత.


చ.

బలి జగదేకదాత యని పల్మఱు భూమిసుధాశనోత్తము
ల్పలుక ముదంబుతో విని సుపర్వమనోరథసాధనోద్యమం
బలర మృషావటుండు బలి యాచన సేయుటకై నివేశము
న్వెలువడె నింక నెవ్వరొరు వేఁడనివారలు వేళ వచ్చినన్.

81


తే.

కురిసెఁ బువ్వులవానలు మెఱసె దిశలు, విరిసెఁ గావిరి దుందుభు లొరసె దివిని
దొరసె గంధర్వగాన మచ్చరలయాట, మెఱసె జగములు వేడుకఁ బొరసె నపుడు.

82


సీ.

ఒకవింతహరువైన యూర్ధ్వపుండ్రంబుపైఁ బెట్టిన మేధావిబొట్టు దనర
నీలంపుఱానిగన్నిగలీను సిగగంటు నవరత్నఖచితకుండలము లమర
నవమైన కృష్ణాజినముతున్క మెలిగొన్న ధవళయజ్ఞోపవీతంబు మెఱయ
ముప్పేటఁ బెనఁగొన్నముంజి పచ్చనిగోఁచి వెలిపట్టుపంచయు మొలఁ దనర్ప


తే.

మణిపవిత్రము దండకమండలువులు, గొడుగు పావాలు పాత్రిక బెడఁగుమీఱఁ
బసుపుఁబూసిన టెంకాయఁబాణిఁ బూని, వామనుఁడు వచ్చె బలి యజ్ఞవాటమునకు.

83


తే.

కపటవటు దివ్యతేజఃప్రకాశనంబుఁ, గాంచి యప్పుడు విజ్ఞానఘనులు మునులు
లేచి కరములు ముకుళింవఁ జూచి శుక్రుఁ, డసురవల్లభుతోడ నేకాంతమునను.

84


మ.

అదిగోఁ జూచితె బ్రహ్మచారివలె దైత్యారాతి యేతెంచె న
త్త్రిదశాధ్యక్షున కెల్లసంపదలు నెంతే ప్రేమతో నీయఁగా
నదితీగర్భమునం జనించె నితఁడే మర్థింప నీ వీయఁగా
మదిలో సెంచకు మీయనెంచినను సామ్రాజ్యంబు లేదింకిటన్.

85


తే.

ఆత్మబుద్ధి సుఖం బిచ్చు నంతకన్న, గురువు సెప్పిన సద్బుద్ధి పరులబుద్ధి