పుట:Dashavathara-Charitramu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అప్పు డొకచారుఁ డేతెంచి యసురనాథ, నీకు జయపెట్టుచున్నారు నిఖిలజనులుఁ
గొదవ వల దెందు హిమగిరికూటమునను, గంటి నొక్కవిశేషంబుఁ గన్నులార.

31


సీ.

అతిఘోరగహనమధ్యమున వర్తించుచో మేఘంబులోని క్రొమ్మెఱుఁగుకరణిఁ
జలికాలమున జలాశయమున నుండుచోఁ గొలనిలో రాయంచకొదమపగిదిఁ
గడగి పంచాగ్నులనడుచక్కి నిలుచుచో లలితమౌ పసిఁడిసలాకజోకఁ
బుడమిఁ బాదాంగుష్ఠమున నెలకొన్నచోఁ బాఁదులో లేఁదీఁగె బాగుమీఱఁ


తే.

జిలుకవలెఁ గోయిలవిధాన ఫలము పర్ణ, ములు మెసంగుచుఁ గొన్నాళ్లు జలము మొదలు
గ్రోల కిప్పుడు రత్నపాంచాలిలీలఁ, దపము సలిపెడు సురమాత దైత్యనేత.

32


క.

అని విన్నవించినప్పుడె, విని చిన్నంబోయె దైత్యవీరుఁడు మది యో
జన చేసి యొకయుపాయము, గని దైత్యులఁ బంప వారు గానిమ్మనుచున్.

33


తే.

పరఁగ నిరువదియైదేండ్లప్రాయ మలరు, విప్పుగన్నులుఁ దైజసవిగ్రహములుఁ
గలుగు వేల్పులరూపము ల్గాంచి తత్త, దుచితవస్త్రాభరణశస్త్రనిచయ మూని.

34


వ.

అంత.


చ.

జడనిధి నీవహీనగుణసంగ మెఱుంగవు హేమచేలికిం
బడుచు నొసంగి దుర్విషము భర్గున కిచ్చితివంచు నవ్వి దా
పడుచు నొసంగె భర్గునకు భాసురకీర్తి హిమంబు పేరిటం
జడిగొననొప్పు నత్తుహినశైలముమీఁదికిఁ బోయి యచ్చటన్.

35


మ.

చరణాంగుష్ఠము నేల నూఁది భుజము ల్సారించి భూరేణుదూ
సరితానీలజటాభరంబు గుదుల న్సంధించి మోమెత్తి యం
బరము న్సూచుచు శ్వాసవాయువుల నిర్బంధించి యత్యంతదు
స్తరమైనట్టి తపంబు సేయు నదితిం దర్శించి వే మ్రొక్కుచున్.

36


శా.

తల్లీ యేల తపంబు చేసెదు నవోద్యానస్థలీమల్లికా
వల్లీజైత్రము నీదుగాత్రము వనావాసైకపాత్రంబుగా
నిల్లీల న్నొగిలింప నాయమగునే యేపాటిదీనం ఫలం
బిల్లీపాటిని జేరు మోసమగుసుమ్మీ దానవు ల్సూచినన్.

37


చ.

తనువు గృశింపఁజేయునది ధర్మము గాదని పెద్దలాడఁగా
వినివినియుండి యేటికి వివేకము లేక తపంబు సేయఁబూ