పుట:Dashavathara-Charitramu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

యుదిరికంబంబు మఱుఁగున నొదుఁగురమణి, డాఁగఁబోయి సమక్షంబు డాయుతరుణి
స్వీయు లంచును బరులను వేఁడు కలికిఁ, గలసి యంతఃపురంబు చీకాకువడియె.

46


చ.

అదరున నిల్లు పొచ్చి యమృతాశనుఁ డొక్కఁడు దల్పుమూల యం
దొదిఁగినఁ దన్ను నీడ్వఁ బద యూరకె వచ్చెద నంచు నాలుగే
న్పదములు వెంటఁబోయి కలపంబిదె తెచ్చెద నుండుమంచుఁ దా
సదనము చేరి తల్పు గెడసాచె నొకానొకకాంత నేర్పునన్.

47


వ.

అప్పుడు.

48


సీ.

జిగిమేనియోరలఁ దగునంపజీరలు గొనగోటితాఁకుల కోపు సూప
వడి నౌడు గఱచుచో వాతెఱనంటిన మొనపంటివగఁ గంటిమురువు నెఱప
ఱొమ్ముగాయముల రక్తమ్ము గాఢాశ్లిష్టకుచకుంభలగ్నకుంకుమము దెలుప
నతిరోషశోణంబులగు నేత్రకోణము ల్లీలమై నిద్దురలేమిఁ జాటఁ


తే.

జాఱుసికఁదోఁగు చెమ్మట శ్రమము గాఁగ, వీరశృంగారరసములు వియ్యమంద
విజయలక్ష్మీవధూసంగవిభ్రమంబు, లభినయింప నిలింపలోకాధివిభుఁడు.

49


మ.

వలచే వజ్రము ఱొమ్ములో బిగువు గర్వంబుం బ్రమోదంబు మీ
సలలో నవ్వు నొయారముం జెలఁగ నుత్సాహంబుతోఁ బాదమం
జులమంజీరఝళంఝళ ల్వెలయ రక్షోనాథశుద్ధాంతకాం
తల నీక్షించుచు భీతి దక్కి నలుచెంత ల్సూచుచు న్ముందటన్.

50


మ.

కులుకుందంతపుబొమ్మ చెక్కడపుబల్కంబంపు మేల్బోదెలం
దళమౌ నీలపుఱాలదూలములపైఁ దార్కొన్న నున్పచ్చదం
తెల దాపించిన కెంపుటిట్టికలసందిం బొంది రావజ్రగా
రెలఁ జెన్నౌ నొకగట్టిచప్పరములో రేరాచరాతిన్నియన్.

51


శా.

కాంతల్ క్షేమముఁ గోరి సేయు వ్రతసంఘాతంబుచే నంగ మ
త్యంతంబుం గృశ మయ్యుఁ జంద్రశకలోదారప్రభ న్మీఱఁగాఁ
జెంతన్ దానవదైత్యరాజతరుణు ల్సేవింపఁగా నెంతయుం
జింత న్జెందునిశాచరేశ్వరునిరాజీవాక్షి దౌదవ్వునన్.

52


తే.

తను విలోకించి సింగంబుఁ గనినకరిణి, కరణిఁ దత్తఱమంది మందిరము సొరఁగ
నెందుఁ బోయెదవంచుఁ బూర్ణేందువదన, వేణిఁ బట్టీడ్చెఁ గదిసి గీర్వాణవిభుఁడు.

53