పుట:Dashavathara-Charitramu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

చండవాతోత్థభూరజోహిండనమునఁ, గొండమెండునఁ గదలకయుండు దైత్య
మండలేంద్రునిదేహ ముద్దండముగను, గండకండూతి నొఱయు వేదండగణము.

27


తే.

మానస మచంచలంబైన మట్టుపడెనొ, గాక నాసాబిలంబులఁ గ్రందుకొన్న
చిలువగుంపులు మేసెనో తెలియరాదు, వెలివి సరదయ్యె దైత్యేంద్రవిభుని యూర్పు.

28


తే.

పవనమున నిండి వానలఁ బదనుగన్న, రజముపైఁ గూళ్లు వెట్టిన ద్విజకులంబు
రెట్టలో విత్తుగమి యంకురింప శుక్ర, శిష్యశేఖరు చెవులలోఁ జెట్లు మొలచె.

29


తే.

ఇంక నొకవింత యాదానవేంద్రుకడిఁది, మేనఁ బుట్టిన పుట్టక్రొమ్మెఱుగుఁగోళ్ల
గ్రుచ్చి తేనియఁ గైకొను నిచ్చనిచ్చ, నచ్చభల్లంబు లచ్చట నచ్చుపడఁగ.

30


చ.

శిరసుననున్న తేనె పెఱశీతమయూఖునిరేఖగా నభం
గురతరదేహయష్టిఁ బెనఁగొన్న భుజంగకదంబకంబు లా
భరణములై దగ న్శుకవిపాటిచూతఫలస్రవస్మరం
దరసము గంగగాఁ దపము దైత్యుఁ డొనర్చు మహోగ్రవైఖరిన్.

31


క.

అని వినిపించిన విని మిం, చినభయమున నింద్రుఁ డనుపఁ జెలువలతోడం
గనకాంగి యల్ల మందర, మునకుం జని హావభావములు దళుకొత్తన్.

32


క.

ఆటలఁ బాటల మాటలఁ, దేటల నలపింపలేక దితిజాధీశుం
బాటలగంధి బలాసుర, పాటనుకడ కేఁగుదెంచి భయవినయములన్.

33


చ.

పలికిన మోముఁ జూపినను బాడిన నాడినఁ గేల నంటిన
న్గలకల నవ్విన న్ననుచు గా భువి నెల్ల పలాశిబృంద మం
చలవునఁ బోయి నేనలపలాశిని డగ్గఱి స్థాణువైఖరి
న్నిలువఁగఁ జూచి వచ్చితిని నేర్పు వితాచనఁగా సురేశ్వరా.

34


క.

నీచిత్త మింకమీఁదట, నాచేతం గాదటన్న నారీమణి యిం
కేచంద మనుచు మది నా, లోచన చేయుచు సహస్రలోచనుఁ డుండెన్.

35


ఉ.

అంతటఁ గొంతకాలమున కచ్చటి కొక్కచరుండు వచ్చి వృ
త్తాంతక దానవేశ్వరుఁ డుదారతపస్థితి నున్న దేహ మా
ద్యంతము మక్షిక ల్మసలె నస్థులనంటుక జీవముంట మా
కింతయుఁ దోఁచ దన్న దివిజేశ్వరుఁ డెంతయు సంతసంబునన్.

36


క.

మన కిదియే సమయం బిఁక, నని యన్యనిశాటకోటి నణఁగింప నటం
చును వజ్రి కుమారునిఁ జూ, చిన మంచిద యనుచు నతఁడు సేనలు గూర్చెన్.

37


మ.

జలధివ్యంజితశాదము ల్ప్రళయగర్జన్మేఘసంవాదము
ల్దళితక్ష్మాధరపాదము ల్దనుజకాంతాగర్భనిర్భేదము