పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవుల కష్టసుఖములు

223


ఆయీ పద్యాన్ని చెప్పించి యిట్టి రచనవలన పేరుప్రతిష్ఠలు గడించిన మహనీయుల నామములను,

సీ. నన్నయకవి పెట్టినాఁడుకదా? తిక్క
    నాది కవీంద్రుల కాదిభిక్ష.

గీ. వారలును వారిమార్గమ్ముగోరి యాంధ్ర
    కృతుల నొనరించి బహుబహూకృతుల నలరు
    వారలును మాకుఁ బూజ్యులు వారికన్న
    నితరకవిసత్తముల జోలియేలమాకు?"

అనేపద్యంలో మజ్ఞళార్థంగా యేకరు పెట్టించి, లోకంలో నూటికి తొంభైమంది మెచ్చుకునే రచన వసుచరిత్ర మనుచరిత్రకంటె కొంత లొచ్చు వాదంలోకి దింపింది. కాని ఈ వాదం యెంతేనా యుక్తం న్యాయం కాకపోదుగాని ఆత్మైకవేద్యంగావుండే యీ విషయం ప్రతివాదులు యెంతో సహృదయులుగా వుంటేనే తప్ప జయం దుర్లభం.

భట్టుమూర్తిరచనలో పెద్దన్నగారి రచనవంటి రచన క్వాచిత్కింగా
“మాయాశీలురు చంచలాత్ములు... మహీపాలు ర్మహావైభవ
శ్రీయోగాంధులు చెప్పనేల? మగవారి న్నమ్మఁగా వచ్చునే."
“పకపకనవ్వి యోవసు నృపాలక బాలికదూఱెదేల?

సుదతిన్ మనోజుబారికి నెఱజేసి లోఁ గనికరింపని వారివి గాక నేరముల్?
“ఆ పద్మోద్భవునోలగంబునకు... దాం రోఫోరొ!.
యే పద్మాసనఁ జూచినన్ జెలియ, నిన్నీక్షించినట్లుండ దే
లా? పల్మాటలు పూర్వజన్మకృతముల్ గాఁబోలు నీనెయ్యముల్

నెలతలలోఁ ద్రిలోకనుత నిర్మలకీ ర్తికలాప ధన్య యీ
కులగిరి రాజకన్య. వేడుకమీ కచిరంబ కల్గెడున్."

నానాగాయన గాయనీమణుల గానం బుర్వి నాలింపమో... వినమో? అందైన నెందైన నెందైన విందై నాదంబొనఁగూర్చునే..." i

ఆయీ పద్యాలే కాదు. మఱికొన్నికూడా అప్రయత్నసిద్ధమైన ధాటిలో భట్టుమూర్తివి పెద్దన్నగారి- -