పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

39

సీ. చింతలూరికి మిరాసీదారుఁడగు జగ్గ
            రాజుకుఁ బుత్త్రు లౌరసులు లేమిఁ
   దనకును బిన్నయౌ తండ్రివందనునకు
            బాపిరాట్సుతు దత్తభావుఁ జేసి
   కొనుటచే నిదివఱకును తద్గృహక్షేత్ర
            కర్తనై యుండుచ కలకటరు క
   చేరీలెక్కలఁ జిత్తగించినఁ జాలు
            నేదినే నెఱుఁగని యిట్టిపనికి
   బాపిరాట్సుతుఁ డని నేను బల్కినట్లు
   వాది పన్నినకపటభావమె నిజ మని
   పట్టి దత్తుఁడు గాఁడంచుఁ బండితుండు
   చేసెఁ దీరు పుభయభ్రష్టుఁ జేసె నన్ను.

ఉ. అత్తినధర్మశాస్త్రవిధి కడ్డని చూడక కల్కటర్నసం
   సత్తుల లెక్కలారయ విచారము సేయక రాజ్యమేలు భూ
   భృత్తుసభాస్థపత్రలిపిరీతిఁ దలంపక విత్తవాంఛచే
   దత్తు నదత్తుఁ డం చను నధార్మికపండితుఁ డుంట యొప్పునే?

మంగన్నమనవిని విని దొరవారు మరల నొకసారి దర్శనమును జేసికొండని సెలవీయఁగా కవులిరువురు నింటికి వెళ్ళిరి. పిమ్మట దాయాదులు మంగన్నతో రాజీపడి సగభాగ మొసంగిరఁట.

మాగాపు శరభకవి

ఈకవి వత్సవాయిరామభూపతిని దర్శించినప్పు డాశువుగాఁ జెప్పిన పద్యము—