తృతీయతరంగము
163
చ. పన్నిన సత్ప్రబంధమున బాగును నోగునుఁ జూడ కీసుచే
మన్నన మాలి మాకులము మాటఁ దలంతురె? చేమకూరి వెం
కన్నకు లోపమేమి? కులమా కవనానకు వేంకటాద్రిరా
జన్న గణించి మీరలు దయామతిఁ బ్రోచిన నాకుఁ జాలదే?
వేంకటాద్రినాయఁడుగారిపై వేఱొక కవి చెప్పినది.
గీ. వైభవోద్దాముఁ డైనట్టి వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రుఁ డర్థార్థి వితతి కొసగు
నొక్కపూట వ్యయంబు లీ తక్కినట్టి
రాజకోటికి నొకయేటి భోజనంబు.
ఈపద్యమును రచించినకవి రాళ్ళబండి పట్టాభిరామరాజను బట్టనియు (ఇతండు మలరాజువారి యాస్థానకవి), నీతఁడు కృష్ణాస్నానమునకై యమరావతి కేగినప్పుడు వేంకటాద్రినాయఁడుగారిని దర్శించి చెప్పెననియు—నీవిషయము నెఱింగి మలరాజు వేంకటగుండారాయణంగారు రౌత్రమూర్తులై “మనయుప్పు పులుసుతోఁ బెరిగి సాటివాని నట్లు వొగడిన యాకృతఘ్నుఁడు మనదేశములో నడుగుఁబెట్టెనేని ఫిరంగితో గాల్చుఁడు” అని తమసైనికుల కుత్తరువు జేసి రనియు—నీ సంగతినంతయు విని యాబట్టు వేంకటాద్రినాయఁడుగారివద్దనే యమరావతిలో యుండి తరువాత కొలఁదికాలమునకే పరలోకగతుఁ డయ్యెననియు వినికి గలదు. అచటినుండియే
ఆ. వెలమదొరలపొందు వేయేండ్లు చేసినఁ
గాసువీస మైనఁ గానరాదు