164
చాటుపద్యరత్నాకరము
మెచ్చె నేని మంచిముచ్చటఁ జెప్పును
అలిగె నేని ప్రాణహానిఁ జేయు.
అను పద్యమును వ్రాసెననియుఁ గింవదంతి గలదు.
జూపల్లి ధర్మారాయఁడు
ఈరపరాజు, సూరపరాజు ననునిరువురుకవులు జతఁగూడి ధనసంపాదనకు బయలువెడలిరఁట. వారు దేశసంచరణంబు చేయుచు, నొకనాఁ డీధర్మారాయఁ డుండుగ్రామముఁ జేరిరి. ఇద్దరు నొకచోటికే పోవుట యుక్తముకా దని తలంచి, యీరపరాజుమాత్రము ధర్మారాయనిదర్శనమున కేఁగెనఁట. సూరపరాజు వేఱొకచోటికిఁ బోయెనఁట. ధర్మారాయఁడు కవిని సమ్మానింపలేదఁట. వీరిరువురుని, తమబసకు చేరిన తర్వాత, సూరపరాజు రెండవకవి నిట్లడిగెనఁట.
క. జూపల్లిధర్మరాయం
డేపాటిధనం బొసంగె? నీరపరాజా!
అనఁగా నీరపరా జిట్లు సమాధానమును జెప్పెనఁట.
పాపాత్ముం డెవ్వరికిని
చూపనిదే చూపె నయ్య సూరపరాజా!
ధర్మారాయనిఁ గూర్చిన మఱికొన్నిచాటువులు
చ. ఎఱుఁగనివానిఁ గోటఁ జొఱనీయఁడు నేర్పున జొచ్చె నేనియున్
దొరసముఖమ్ము దొర్కుటది దుర్లభ మట్లు లభించె నేనియున్