పుట:Chanpuramayanam018866mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[ 4 ]

గ్రామమునందలి దేవాలయములో నొక్క తెలుఁగుశాసనమును, దాని కనువాదముగా నొక యరవశాసనమును గలవు[1]. ఈశాసనములో వరదప్పనాయనితోఁ గూడ నిరువదియైదు తరములవారు పేర్కొనఁబడియున్నారు. వీరిలో వరదప్ప యను పేరుగలవాఁ డితఁ డొక్కఁడుమాత్రమే యున్నాఁడు. తిరుములార్యుని గౌరమించిన చెంజి వరదేంద్రుఁ డీవరదప్పనాయఁడే యనుటకు సందేహ ముండఁగూడదని నాయభిప్రాయము, వరదప్పనాయనిశాసనసంవత్సరము క్రీ. 1671 సంవత్సరమునకు సరిపడును. ఇఁక వీరవేంకటపతిరాయశౌరి యెవ్వరో చూతము. పేరును బట్టి చూడ నీతఁడు కర్ణాటరా జని స్పష్టమగుచున్నది. సుప్రసిద్ధుఁ డగు వీరవేంకటపతిరాయలు క్రీ. 1614 ప్రాంతమున మృతి నొందెను. 1648 ప్రాంతమున శ్రీరంగరాయలు రాజ్యమునకు వచ్చి 1678 ప్రాంతమందు రాజ్యభ్రష్టుఁడై మహిసూరుదేశములో మృతినొందెను. ఈయిద్దజురాజుల నడిమికాలమునందుఁ బలువురు రాజ్యమును గాంక్షించుటచే ఘోరమగుపోరు పుట్టి శ్రీరంగరాయలు రామరాయలు వేంకటపతిరాయలు ననువారు స్వల్పస్వల్పకాలము సింహాసన మధిష్టించి పదభ్రష్టు లగుచు వచ్చిరి. శ్రీరంగరాయలపిదప క్రీ. 1678-1680 సంవత్సరములలో వేంకటపతిరాయలు రాజ్యము చేసినట్టులు కొన్ని[2]శాసనములవలనఁ గనఁబడుచున్నది. ఈవేంకటపతిరాయలకాలము చెంజి వరదప్పనాయనికాలమునకు సరిపోవుచున్నది. ఈతఁడే తిరువేంగళార్యుని గౌరవించిన వీరవేంకటరాయశౌరియైనట్లు తోఁచుచున్నది. నిజముగా శ్రీరంగరాయలతోడనే కర్ణాటరాజ్య మంతమైనది. అదిమొదలు చాలకాలమువఱకు నావంశములోనివా రెవ్వరో యొక రానెగొంది సమీపదేశమునకుఁ బ్రభువులై పూర్వాధికార మంతరించినను బూర్వరాజుల బిరుదములను మాత్రము పెట్టుకొనుచుండినట్లును, గౌరవార్థముగా వారినే కర్ణాటరాజులుగా మధురనాయఁకులు మొదలగువారు భావించుచుండినట్లును శాసనములవలనఁ గన్పట్టుచున్నది. ఇక వెలుగోటి వేంకటవిభుఁ డెవ్వరో చూడవలసి యున్నది. బ్ర. వెల్లాల సదాశివశాస్త్రిగారు రచియించిన వెలుగోటివారి వంశచరిత్రమువలన వేంకట యనునామముగల వారు 19-20-21 తరములలో మాత్రమే యున్నట్టులు కనఁబడుచున్నది. 20వ తరమువాఁడైన యాచ


  1. ఈశాసనములు రాజకీయశాసనాధికారులు 1917 సంవత్సరములో సంపాదించిన శాసనములలో 860-861 సంఖ్యలు గలవి. వారికార్యస్థానమునఁ జూడనగు.
  2. చూ. Sewell's Lists of Antiquities Vol. II.