పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 111

మాట్లాడింది? అధికతేజోవంతుడైన ఆసన్యాసి ఎవరు?

బిచ్చ - ఈమె యిచ్చటికి వచ్చింది గనుక నా కాశ్రయము దొరికింది. (పిచ్చిదీ శిష్యులూ వెంటరా సోమగిరి వచ్చును.)

పిచ్చి - మన కిక్క డేమిపని? పోదమా? ఇల్లు విడచి చాలాకాలమయింది!

సోమ - ఔను, పోవచ్చును.

పిచ్చి - నా మానసమున నేదో యుండి ఇన్నాళ్ళూ నన్ను తిప్పింది. ఎం తవమాన మయింది! అడవులన్నీ తిరిగి తిరిగి దిమ్మరి నైనాను.

చింతా - అమ్మా, కరుణామయీ, నాతో నొక మాటాడవా?

పిచ్చి - తల్లిని నేను కాను. ఇతని నడుగు.

చింతా - నీకొర కెంతో వెదకినాను, ఎందరినో అడిగినాను. నా మనోవాంఛాఫలసిద్ధి అయ్యేటట్టు నన్నాశీర్వదించు. (సోమగిరితో) మహాత్మా, నాకు తరణోపాయ మేది? నేను దౌర్భాగ్యురాలను. రాధావల్లభుడు నాబాధల తొలగించునా?

సోమ - అతడు పతితపావనుడు, తప్పకుండా నిన్ను దరిజేరుస్తాడు, చింతించకు.

              చింతా - పాషాణనిర్మితము ♦ దోషకలితంబును
                                  నీరవ మరుభూమి ♦ నీరవర్జితము
                         నామనం బటనెట్లు ♦ ప్రేమ జనించును?