రం 1] బిల్వమంగళ 111
మాట్లాడింది? అధికతేజోవంతుడైన ఆసన్యాసి ఎవరు?
బిచ్చ - ఈమె యిచ్చటికి వచ్చింది గనుక నా కాశ్రయము దొరికింది. (పిచ్చిదీ శిష్యులూ వెంటరా సోమగిరి వచ్చును.)
పిచ్చి - మన కిక్క డేమిపని? పోదమా? ఇల్లు విడచి చాలాకాలమయింది!
సోమ - ఔను, పోవచ్చును.
పిచ్చి - నా మానసమున నేదో యుండి ఇన్నాళ్ళూ నన్ను తిప్పింది. ఎం తవమాన మయింది! అడవులన్నీ తిరిగి తిరిగి దిమ్మరి నైనాను.
చింతా - అమ్మా, కరుణామయీ, నాతో నొక మాటాడవా?
పిచ్చి - తల్లిని నేను కాను. ఇతని నడుగు.
చింతా - నీకొర కెంతో వెదకినాను, ఎందరినో అడిగినాను. నా మనోవాంఛాఫలసిద్ధి అయ్యేటట్టు నన్నాశీర్వదించు. (సోమగిరితో) మహాత్మా, నాకు తరణోపాయ మేది? నేను దౌర్భాగ్యురాలను. రాధావల్లభుడు నాబాధల తొలగించునా?
సోమ - అతడు పతితపావనుడు, తప్పకుండా నిన్ను దరిజేరుస్తాడు, చింతించకు.
చింతా - పాషాణనిర్మితము ♦ దోషకలితంబును
నీరవ మరుభూమి ♦ నీరవర్జితము
నామనం బటనెట్లు ♦ ప్రేమ జనించును?