పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకలి దప్పలుండవ-ప్రక7,16. మూడవ లక్షణం, అది శక్తిమంతమైనదిగా ఉంటుంది. దేవుడు తన శక్తితో క్రీస్తుని లేపాడు, అదేశక్తితో మనలనూ లేపుతాడు. కనుక మన ఉత్తాన దేహం దైవశక్తితో నిండివుంటుంది-ఎఫే 1, 19–20. నాల్గవ లక్షణం, అది ఆధ్యాత్మికంగా ఉంటుంది. అనగా మహిమ శరీరం పవిత్రాత్మతో నిండి ఉంటుంది. మన తనువు ఈ లోకంలోనే పవిత్రాత్మకు ఆలయమైవున్నా అది యిక్కడ జంతువాంఛలతో నిండివుంటుంది. ఆత్మకు అట్టే లొంగదు. కాని అది పరలోకంలో పవిత్రాత్మతో నిండి ఆత్మకు వశవర్తినియై ఉంటుంది. కనుక ఈ భౌతిక దేహమే ఉత్తానమైనా, ఈ దేహానికీ, ఆ పరలోక దేహానికీ ఎంతో తేడా వుంటుంది. విత్తనానికీ ఆ విత్తనం నుండి మొలిచే మొలకకీ ఎంత వ్యత్యాసం ఉంటుందో మన యిహలోక శరీరానికీ పరలోక శరీరానికీ అంత వ్యత్యాస ముంటుంది.

4. పరలోకంలో మన ఉత్థాన దేహంకూడ దానంతట అది త్రీత్వైక సర్వేశ్వరుణ్ణి దర్శించలేదు. అక్కడ మన తనువు క్రీస్తు ఉత్తానదేహంతో ఐక్యమై ఆ ప్రభువు నుండి దివ్యశక్తిని పొందుతుంది. ఆ శక్తితోనే అది త్రీత్వైక సర్వేశ్వరుడ్డి చూడగల్లుతుంది.

5. ఒక్క మన శరీరం మాత్రమే కాదు, ఈ విశ్వమంతాగూడ మహిమను పొందుతుంది. నరుడు ఈ విశ్వంలో జీవిస్తాడు. కనుక విశ్వం అతని కోసం ఉంది. నరుడు పాపం చేసి తన ఉన్నతస్థితిని కోల్పోయినప్పడు ఈ విశ్వంకూడ శాపానికి గురైంది. అతడు ఉత్తానమై మహిమను పొందినపుడు ఈ విశ్వంకూడ మహిమను పొందుతుంది. “స్నశానికి గురైంది. కాని ఒకనాడు అది వినాశ దాస్యం నుండి విముక్తి చెంది, దేవుని పుత్రుల మహిమాన్వితమైన స్వాతంత్ర్యంలో పాలు పొందుతుంది" అని వ్రాసాడు పౌలు-రోమా 8,20-21. "దేవుడు నీతికి నిలయమైన క్రొత్త భువిని క్రొత్తదివిని వాగ్హానం చేసాడు. మనం వాటికోసం వేచివుండాలి? అని చెప్నంది-2 పేత్రు 3, 13. "సింహాసనాసీనుడైన ప్రభువనేనిపుడు అన్నిటిని క్రొత్తవాటిని చేస్తానని పల్మాడు" అంటుంది దర్శనగ్రంథం 21,5. ఈ వేద వాక్యాలన్నీ మహిమను పొందబోయే నూత్న విశ్వాన్ని సూచిస్తాయి. కనుక ఈ ప్రస్తుత ప్రపంచం నాశంకాదు. ఇది క్రొత్త ప్రపంచంగా మారిపోతుంది. లోకాంతంలో మన దేహాలు నాశంకావు, మహిమను పొందుతాయి. అలాగే యుగాంతంలో ఈ విశ్వంకూడ నాశంకాదు, క్రొత్తదనాన్ని పొందుతుంది.