Jump to content

పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేపబడిన వారిలో జ్యేషుడు. కనుక మనం కనిషులం - కొలో1,18. ఈలా క్రీస్తుఉత్థానం మన ఉత్తానానికి మాదిరీ కారణమూ ఔతుంది.

2. ఉత్దాన సత్యాలు

1. సజ్జనులకు దుర్మారులకూ గూడ లోకాంతంలో ఉత్తానం సిద్ధిస్తుంది. తొలి మానవుడు అమరుడు. పాపంవలన అతడు అమరత్వాన్ని పోగొట్టుకొన్నాడు. ఉత్తానంద్వారా దేవుడు మళ్లానరులందరికీ ఆదివరమైన ఈ యమరత్వాన్ని దయచేస్తాడు. ఏ నరుడూ ఈవరాన్ని తిరస్కరించలేడు. కనుక పుణ్యాత్ములూ పాపాత్ములూకూడ కడన జీవంతో లేస్తారు. కాని పుణ్యాత్ములు ఉత్తానంద్వారా మహిమను పొందుతారు. వాళ్లు క్రీస్తుద్వారా లేచి క్రీస్తు మహిమలో తామూ పాలుపొందుతారు. ఇక, పాపాత్ములు క్రీస్తుని నిరాకరించినవాళ్ళ కనుక వాళ్లు క్రీస్తు మహిమలో పాలుపొందరు. రెండవ మరణమైన నరకాన్ని పొందుతారు.
2. మనం పూర్వ దేహంతోనే ఉత్థానమౌతాం. అనగా మనం ఈ లోకంలో జీవించినపుడు ఏ దేహంతో ఉన్నామో ఆ దేహంతోనే లేస్తాం. అన్యదేహాన్ని పొందం. ఐతే ఉత్తానమయ్యాక మన పూర్వదేహం మహిమను పొంది పూర్తిగా మారిపోతుంది. ఈ లోకంలో ఉన్నపుడు మన శరీరం ఆకలి దప్పలకూ వ్యాధి బాధలకూ గురౌతూంటుంది. జీవంతో లేచాక దానికి ఈ బాధలేవీ ఉండవు, అప్పడది మహిమ శరీరంగా మారిపోతుంది. కొందరు ఆధునిక వేదశాస్తులు మనం మరణించిన వెంటనే మన దేహం ఉత్థానమౌతుందని చెప్తున్నారు. కాన ఈ భావమింకా వ్యాప్తిలోకి రాలేదు.
3. మహిమ శరీర లక్షణాలు నాలు. 1కొ 15,42–44ను ఆధారంగా తీసికొని వేదశాస్తులు మహిమ శరీర లక్షణాలను నాల్డింటిని పేర్కొన్నారు. మొదటి లక్షణం, అది ప్రకాశవంతంగా ఉంటుంది. ఉత్తానక్రీస్తు శరీరంలాగే మన శరీరంకూడ తేజస్సుని పొందుతుంది-ఫిలి 3,21. రెండవ లక్షణం, అది అవినాశంగా ఉంటుంది, పాపఫలితంగా ఇక్కడ మన శరీరం వ్యాధిబాధలకూ మరణానికి వినాశనానికి గురౌతుంది. కాని ఉత్తాన శరీరం క్రీస్తుఉండి తేజస్సునీపూర్ణజీవాన్ని పొంది అవినాశమౌతుంది. పరలోకంలో ఉత్థాన దెహనికి సంతానేచ్ఛ ఉండదు. అక్కడివాళ్ళు పెండ్లిచేసికోరు - మత్త 22,30. వాళ్ళకు