పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్ధనా భావాలు

1.వేదశాస్త్రులు ఉత్ధానాన్ని బీజం మొలకైతడంతో పోల్చారు. ఓ ప్రత్యేక బీజంనుండి ఓ ప్రత్యేకమైన మొలకవస్తుంది. చింత విత్తనం నుండి చింత మొలకే మొలుస్తుంది. వేప విత్తనం నుండి వేపమొలకే మొలుస్తుంది. అలాగే మన పూర్వ దేహంనుండే మహిమ దేహం ఏర్పడుతుంది. ఆ రెండింటికీ సంబంధం ఉంటుంది. ఐనా ఆ విత్తనానికీ దానిలో నుండి మొలచే మొలకకీ, ఎంతో వ్యత్యాసముంటుంది. అలాగే నరుని పూర్వదేహమే ఉత్థానమైనా, అది యెంతో మారి మహిమాన్విత శరీరంగా లేస్తుంది. ఈలా సామ్యమూ, భిన్నత్వమూ గల అద్భుతమైన ఉత్థానాన్ని దేవుడు మాత్రమే మనకు దయచేయగలడు. అందుకు ఆ ప్రభువుకి వందనా లర్పించాలి,
2.ఈ ప్రకృతిలో ఎక్కడ చూచినా ఉత్ధానం కన్పిస్తూనే ఉంటుంది. సూర్యచంద్ర నక్షత్రాలు రోజురోజు అస్తమించి మళ్ళా ఉదయిస్తూంటాయి. భూమిలో నాటిన విత్తనం మళ్ళా మొలకెత్తుతూంది. అలాగే ఆకు రాల్చిన చెట్టూ, నేలలో నాటిన కొమ్మా మళ్ళా చిగురిస్తున్నాయి. ఈ ప్రక్రియలన్నీ ప్రకృతిలోని ఉత్ధానానికి నిదర్శనాలు. నరదేహాన్నీ కూడ ఓ విత్తనంలా నేలలో నాటుతారు. అది ఈ నేలనుండి మళ్ళామొలకెత్తుతుంది. బీజంలోని జీవశక్తివల్ల, అనగా క్రీస్తు ఆత్మల సాన్నిధ్యంవల్ల,అది మళ్ళా ఉత్ధామౌతుంది. ఈ యద్భుత వరానికి మనం దేవునికి నమస్కారం చేయాలి.
3.నరులు సహజంగానే అమరత్వాన్నీ శాశ్వతత్వాన్నీ కోరుకొంటారు. "మృత్యోర్మా అమృతం గమయ" అన్నవైదిక ఋషి ప్రార్ధనం మనందరి ప్రార్ధనంకూడ.కాని మనంతట మనం ఈ శాశ్వతత్వాన్ని పొందలేం. ప్రభువే ఉత్థానం ద్వారా ఈ భాగ్యాన్ని మనకు దయచేస్తాడు. ఈ భాగ్యంపట్ల మన హృదయంలో గాఢమైన వాంఛను గూడ ముందుగానే నెలకొల్పుతాడు. ఆ ప్రభువు మంచితనాన్నీ ప్రేమనీ మనం వేనోళ్ళ కొనియాడాలి.
4.హిందూ సంప్రదాయం ప్రకారం దేహం చెడ్డది. పక్షిపంజరంలోలాగ మన ఆత్మదేహంలో బంధింపబడి ఉంటుంది. అది ఆత్మకు చెరలాంటిది. కనుక దేహం