పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియకూడ మన రక్షణంలో పాల్గొంది అన్నపుడు క్రీస్తుకి అప్రియం గలుగదు. ఆమెను గౌరవించడంద్వారా క్రీస్తుకి గౌరవం తగ్గిపోదు. ఆ తల్లిని గౌరవించినపుడు క్రీస్తునే గౌరవించినట్ల

మరియు రెండవ యేవ. మన పతనాన్ని తలంచుకొనేపుడెల్లా తొలియేవను స్మరించక తప్పదు. అలాగే మన ఉద్ధరణాన్ని తలంచుకొనేపడు ఈ రెండవ యేవను స్మరించకతప్పదు. తొలి యేవ పతనమూ, మలియేవ ఉద్ధరణమూ ఈ రెండూ చారిత్రక ఘట్టాలు, వీటిని మనం కాదనకూడదు, కాదనలేము. ఇక మరియ క్రీస్తు రక్షణంతో సహకరించడంవల్ల క్రీస్తుతోపాటు తనూ సహరక్షకి అనబడుతూంది అన్నాం. కాని మరియ క్రీస్తు రక్షణంతో ఏలా సహకరించింది? ఆమె మనలను ఏలా రక్షించింది?

2. మరియ మూడు దశల్లో సహరక్షకి

మరియ మూడుదశల్లో సహరక్షక్రిగా వ్యవహరించింది. క్రీస్తు జననమందు, కల్వరిమీద, మోక్షంనుండి ఈ మూడు దశలను క్రమంగా విచారించి చూద్దాం.

మొదట, క్రీస్తు జననమందు మరియు సహరక్షకి, దేవదూత తన సందేహం తీర్చగానే మరియు "నీ మాట చొప్పున నా కగునుగాక” అంటుంది. ఆ వాక్యం ఈ నేలమీది నరులు పల్మిన వాక్యాలన్నిటిలోను గొప్పవాక్యం. ఈ వాక్యం ద్వారా పితతోపాటు సుతునితోపాటు మరియ కూడ మనుష్యావతారానికి సమ్మతించింది. ఈ సమయంలో ఆమె మానవులందరికీ ప్రాతినిధ్యం వహించింది. అనగా దేవుణ్ణి మానవలోకంలోకి తీసికొనిరావడానికి మనందరి తరపున ఒప్పకుంది. ఇక్కడ ఆమె చూపిన బాధ్యతా, అంగీకారమూ చాల గొప్పవి.

క్రీస్తు ఆమెనుండి జన్మించాడుగదా? మరియు క్రీస్తుకి ఓ మానుషదేహాన్ని అర్పించింది. తరువాత ఈ దేహాన్నే క్రీస్తు సిలువమీద పితకు బలిగా అర్పించాడు. కనుక పూజలో గురువు రొట్టె, రసం అనే కానుకలను సమర్పించినట్లే మరియకూడ దైవవార్తకు మానుషదేహం సమర్చిచింది. ఈ బలివస్తువు వలననే కల్వరియాగం నిర్వహింపబడింది.

ఆ తల్లి బలికై గొర్రెపిల్లను సంసిద్ధం చేసింది. లోకపు పాపాలకు పరిహారం చేయడం కోసమై ఈ గొర్రెపిల్ల సిలువమీద చనిపోయింది. ఈ రీతిగా మరియు క్రీస్తు జననం ద్వారానే మన రక్షణంలో పాల్గొంది. భక్తుడు ఆంబ్రోసు నుడివినట్లు, మరియ రక్షకుడ్డి కనడం ద్వారానే మన రక్షణాన్ని కూడ కంది.

రెండవది, మరియ కల్వరిమీద మన రక్షణంలో పాల్గొంది. ఆమె కల్వరి కొండమీద "క్రీస్తుతోపాటు తానూ బాధలు అనుభవించింది. అతని నెత్తటితో తన కన్నీటిబొట్లను