ఈలా తండ్రి వరప్రసాదంగా ఈ లోకంలో అవతరించిన క్రీస్తుకి మనం వందనాలర్పించాలి.
2. అగస్టీను భక్తుడు ఈలా చెప్పాడు. ‘నరుడు దేవుని నుండి వైదొలగితే చస్తాడు. అతని వద్దకు తిరిగివస్తే బ్రతుకుతాడు. అతనియందు నెలకొనివుంటే పూర్ణంగా జీవిస్తాడు". వరప్రసాదం మనం దేవునియందు నెలకొని వుండేలాను, పూర్ణజీవితం జీవించేలాను చేస్తుంది.
3. చాలమంది దేవుని వరప్రసాదంతో సహకరించరు కనుకనే ఆధ్యాత్మికంగా వృద్ధిలోకి రారు. ఇది చెడ్డపద్ధతి. మనం వరప్రసాదంతో సహకరించడం నేర్చుకోవాలి. పౌలు దేవుని అనుగ్రహం వలన నేనింతటివాజ్ఞయ్యాను. అతని అనుగ్రహం నాయందు వ్యర్థం కాలేదు" అని చెప్పకొన్నాడు - 1కొ 15,10. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేయకండి అని కొరింతీయులను హెచ్చరించాడు - 2కొ 6,1. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా మెలగాలి.
7. సహాయక వరప్రసాదాలు మూడు
ఒకే నర్తకి సావిత్రి, సుశీల మొదలుగాగల పలు పాత్రలను ధరించి, పలురూపాలతో, పలు పేళ్లతో రంగస్థలంమీద నటిస్తుంది. అదేరీతిగా సహాయక వరప్రసాదం కూడా చాలా కార్యాలను నిర్వహిస్తూ చాలా పేర్లతో పిలువబడుతూంటుంది. ఈ యధ్యాయంలో మూడు రకాల సహాయక వరప్రసాదాలను పరిశీలిద్దాం.
1. చికిత్సాత్మక వరప్రసాదం
తొలి పాపం ద్వారా నరుని బుద్ధిశక్తి, చిత్తశక్తి రెండూ గాయపడ్డాయి. బుద్ధిశక్తి ద్వారా దేవుని తెలిసికోగలం. ఐనా జన్మపాప ఫలితంగా ఓ విధమైన మాంద్యం ఈ బుద్ధిశక్తిని మంచులాగ ఆవరిస్తుంది. ఈ మాంద్యం వలన ఆధ్యాత్మిక సత్యాలను అంత నిశితంగా గ్రహింపలేక ప్రపంచ వస్తు వ్యామోహాలకు ఇంద్రియ వ్యాపారాలకూ దాసులమై పోతూంటాం. నేటి మన బుద్ధిశక్తి నీరోడ్చే జబ్బు కన్నులాంటిది.
మన చిత్తశక్తి స్వయంగా సత్కార్యాలు చేయగలదు. స్వాతంత్ర్యంతో ప్రవర్తించగలదు. కాని తొలి పాపానంతరం ఆశాపాశాలు దీనికి వస్తాల్లాగ తొడుగుకున్నాయి. దీని ఫలితంగా మన చిత్తశక్తి స్వాతంత్ర్యం కొంతవరకు నశించిపోయింది. అది సత్కార్యాలకు మారుగా దుష్కార్యాలకు పూనుకొంటుంది. మంచిని చేయడానికి మారుగా ఇంద్రియాలకు ప్రియమైన కార్యాలను చేస్తుంది. పర్వతారోహకుడు శిఖరం ఎక్కగలిగికూడ ఒకోమారు బద్ధకించి వెనుకాడుతుంటాడు. ఈ కొండ కొమ్మ ఎక్కలేననుకొని