పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. బైబులు బోధలు



దేవుడు సంపూర్ణ సత్యం. మనం అతన్ని నమ్మవచ్చు - 1మోహా 5,20, అతని కుమారుడైన క్రీస్తు కూడ సత్యమే - యోహా 14,6. సత్యమూర్తియైన దేవుడు సత్యస్వరూపుడైన తనకుమారుని ద్వారా తిరుసభకు పొరపాటు చేయని వరం దయచేసాడు. కనుక ఈ వరాన్ని మనం నమ్మవచ్చు.
 
క్రీస్తు ఓవైపు తిరుసభను దైవరాజ్యాన్ని బోధించమని ఆజ్ఞాపించాడు. మిూరు వెళ్ళి సకలజాతులకు బోధించండి అని చెప్పాడు - మత్త28,19-20. కనుక వేదసత్యాలను బోధించడం తిరుసభ బాధ్యత. మరోవైపు అతడు తిరుసభవిూదికి ఆత్మను పంపుతానని వాగ్దానం చేసాడు. ఆయాత్మడు స్వయంగా సత్యస్వరూపుడు శిష్యులను సర్వసత్యంలోనికి నడిపించేవాడు - యోహా 16,18, ఈయాత్మశక్తి ద్వారా శిష్యులు సత్యంలో నిలుస్తారు. అనగా అన్ని పొరపాట్లనుండీ దోషాలనుండీ ఆత్మ తిరుసభను కాపాడుతుంది. ఈ వరం తిరుసభ ప్రధానాధికారియైన పోపుగారికికూడ లభిస్తుంది.

ప్రభువు పేత్రుతో నీవు పడిపోయి మల్లా లేచాక నీ సోదరులను బలపరుస్తావు అని చెప్పాడు — లూకా 22, 32. కనుక పేత్రు విశ్వాస సత్యాల్లో కూడ తిరుసభను బలపరుస్తాడు. పేత్రుకున్న ఈ వరం అతని అనుయాయులైన పోపుగారికి కూడ లభిస్తుంది.

పౌలుకూడ తిరుసభ సత్యానికి నిలయమని చెప్పాడు - 1తిమో 3,15. కనుక తిరుసభకాని దాని నాయకుడైన పోపుగారు కాని వేదసత్యాల్లో పొరపాట్ల చేయరు.

2. పొరపాటు చేయని వరం ఎవరికుంటుంది?



పొరపాటు చేయని వరం మొదట పవిత్రాత్మకే వుంటుంది. ఆయాత్మ సత్యస్వరూపి - 14,17. ఈ యాత్మనుండి ఈ వరం తిరుసభకూ దాని అధికారులకూ లభిస్తుంది. క్రీస్తు తిరుసభకు ఆత్మసహాయాన్ని అనుగ్రహించాడు కదా!
ఆత్మసాన్నిధ్యం కలది కనుక తిరుసభ పొరపాటు చేయదు. ఈ తిరుసభ దేవుని నుండి వేదసత్యాలు వింటుంది. ఆ సత్యాలనే నరులకు బోధిస్తుంది. అలా బోధించేపుడు తప్పలు లేకుండా బోధించే శక్తిని ప్రభువే దానికి దయచేసాడు. తిరుసభ అధికారులైన పోపుగారు బిషప్పలు విశ్వాసులు అందరికి కలసి, అనగా తిరుసభ మొత్తానికి కలసి పొరపాటు పడని వరం వుంటుంది. తిరుసభ సభ్యులంతా కలసి క్రీస్తుదేహం, పవిత్రప్రజ, యాజక రూపమైన రాజ్యం - 1షేత్రు 2,9. ఈ ప్రజలందరిని పవిత్రాత్మ అభిషేకిస్తుంది. ఈ యభిషేకం వాళ్లు వేదవాక్యాన్ని విని అర్థంజేసికొని విశ్వసించడానికే - 1యోహా