2 అర్ల్ పట్టణపు సిసేరియస్ అనే వేదశాస్త్రి తిరుసభ ఇహపరాలు రెండింటిలోను వసిస్తుందని చెపూ ఈలా వ్రాసాడు. “మనకు ఇహం పరం అనే రెండు పట్టణాలున్నాయి. మంచి క్రైస్తవుడు ఈలోక పట్టణంలో యాత్ర చేస్తున్నా పరలోక పట్టణానికి చెందినవాడుగా వుండాలి. ఈ భూలోక పట్టణం శ్రమలతోను వేదనతోను కూడింది. పరలోక పట్టణం విశ్రాంతితోను ఆనందంతోను కూడింది. ఇక్కడి పట్టణంలో పాపకార్యాలు చేసేవాళ్లు అక్కడి పట్టణాన్ని చేరలేరు. ఈ లోకాన్ని ప్రేమించేవాళ్లు ఆ లోకాన్ని పొందలేరు. ఎవరూ మోసపోవద్దు.క్రైస్తవులకు నిజమైన పట్టణం అక్కడనేగాని యిక్కడలేదు. ఇక్కడ ఆనందాన్ని అనుభవింప గోరేవాడికి అది పరలోకంలో లభింపదు. మన సొంత దేశం, మన యెరూషలేం, పరలోకంలో వుంది. అక్కడసన్మనస్కులు మనకు సహవాసులు. పితరులు ప్రవక్తలు ప్రేషితులు వేదసాక్షులు మనకు తల్లిదండ్రులు. మనం ఈ లోకంలో వసిస్తున్నపుడే ఆ లోకం కొరకు తపించిపోవాలి. మనకంటె ముందుగా పితరులు ప్రవక్తలు ప్రేషితులు వేదసాక్షులు కన్యలు స్తుతీయులు ఇక్కడినుండి అక్కడికి తరలివెళ్ళారు. వాళ్ళు అక్కడినుండి ఆశతో ప్రేమతో మనకొరకు ఎదురుచూస్తుంటారు. ఆ భక్తులు తమ ప్రార్థనలతోను కోరికలతోను నిరంతరం మనలను ఆ లోకంవైపు ఆకర్షిస్తూంటారు. ఈ లోకాన్నీ పిశాచాన్నీ జయించి మనంకూడ వాళ్ళ వసించే దివ్యలోకాన్ని చేరుకోవాలి?
12.పొరపడని వరం
ఆయా విషయాలను గూర్చి మాట్లాడేపుడూ, వ్రాసేపడూ మనం అజ్ఞానంవల్ల
ఎన్నో పొరపాట్ల చేస్తాం. కాని వేదసత్యాలను గూర్చి ప్రకటనం చేసేపుడు పోపుగారు ఈలా పొరపాటు చేయరు. ఆయన తిరుసభకు వెల్లడిచేసే వేదసత్యాల్లో తప్పలు వుండవు. ఆత్మే పొరపాట్లనుండి పోపుగారిని కాపాడుతుంది. కనుక వేద విషయాలను వెల్లడిచేసేపుడు పోపుగారికి పొరపడని వరం వుంటుందని నమ్ముతున్నాం.
క్రీస్తు దైవరాజ్యాన్ని బోధించమని తిరుసభను ఆజ్ఞాపించాడు. అలా బోధించేపుడుఏ పొరపాటూ చేయకుండా వేదసత్యాలను నిర్దుష్టంగా వెల్లడిచేసే వరాన్నిగూడ అతడు తిరుసభకిచ్చాడు. ఆత్మ ద్వారా ఈ వరం దానికి లభిస్తుంది. కనుక విశ్వతిరుసభకు పొరపాటు చేయని వరం మొదటినుండి వుంది. పోపుగారి వరం ఈ విశ్వ తిరుసభ వరాల్లో ఓ భాగమే కాని ఇతరం కాదు. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.