పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2,20-27. కనుక తిరుసభ సభ్యులంతా కలసి విశ్వాసరంగంలో పొరపాటు పడ్డం అసంభవం. ఆ బృందంలో విశ్వాస దీపం ఎప్పడూ వెలుగుతూనే వుంటుంది.

తిరుసభ సభ్యులంతా కలసి ఓ వేద సత్యాన్ని అంగీకరించినపుడు ఏనాడూ పొరపాటు చేయని దేవుని వరంలోనే వాళ్లు పాలుపొందుతారు. ఆత్మకూడ సత్యాన్ని చేపట్టడంలో వాళ్ళకు సహాయం చేస్తుంది.

ఇక, పోపుగారితో కూడిన బిషప్పల బృందం తిరుసభకు ప్రధానాధికారి. తిరుసభలో అధికార పూర్వకంగా బోధించేది ఈ బ్నందమే. కనుక పై పొరపాటు చేయని వరం ప్రధానంగా ఈ బృందానికి లభిస్తుంది. ఈ బృందం శిరస్సు లేక నాయకుడు పోపుగారు. కనుక ఈ వరం ప్రధానంగా ఆయనకు లభిస్తుంది.

తిరుసభలోని అధికార బృందం రెండు విధాలుగా బోధించవచ్చు. 1. బిషప్పలంతా పోపుగారితో కలసి (ఒకచోట చేరికాని, చేరకుండా గాని) వేద సత్యాలను బోధించవచ్చు. ఈ బోధ పొరపడని తిరుసభ వరం క్రిందికి వస్తుంది. విశ్వాసులందరూ దీన్ని మనఃపూర్వకంగా అంగీకరించాలి. 2. పోపుగారు విశ్వాసులందరికీ కాపరిగాను బోధకుడుగాను సంపూర్ణాధికారంతో బోధించినపుడు ఆ బోధ కూడ పొరపాటు పడని తిరుసభ వరం క్రిందకే వస్తుంది. కనుక దీన్నికూడ విశ్వాసులు మనఃపూర్వకంగా అంగీకరించాలి.

దేవుడే తిరుసభ రక్షణానికి కొన్నివేదసత్యాలను తెలియజేసాడు. బైబులు ద్వారాను పారంపర్య బోధద్వారాను ఈ వేదసత్యాలు మనకు తెలుస్తున్నాయి. మనం త్రాగేనీళ్లు విషపూరితం కాకూడదు. అలాగే తిరుసభ విశ్వసించే వేదసత్యాలు కూడ విషపూరితం కాకూడదు. వాటిని విషపూరితం కాకుండా వుంచేవాడు, అనగా వాటిని పొరపాట్ల నుండి కాపాడేవాడు దేవుడే ఈవిధంగా పొరపాటు చేయని వరంద్వారా దేవుడు తిరుసభ సత్యాలను పదిలపరుస్తుంటాడు.

మొదటి వాటికన్ మహాసభ పోపుగారు వేదసత్యాలను బోధించేపడు పొరపడరని అధికార పూర్వకంగా ప్రకటించింది. ఈ యంశాన్ని మనమందరమూ విశ్వసించాలి. ఆ ప్రకటనం సంగ్రహంగా యిది.

1. పోపుగారు క్రైస్తవులందరికీ కాపరిగాను బోధకుడుగాను వ్యవహరిస్తూ సంపూర్ణాధికారంతో తిరుసభకంతటికీ విశ్వాసాంశాలను గాని నైతికాంశాలను గాని బోధించినపుడు అవి పొరపడని వరం క్రిందికి వస్తాయి. 2. ఆ వేదసత్యాలు ఇక మార్పు లేనేవిగా వుంటాయి. 3. పూర్వం పేత్రుకి పొరపాటు చేయని వరాన్నిచ్చిన క్రీస్తే పోపుగారికికూడ ఈ వరాన్నిస్తాడు. ఈ వరాన్ని క్రీస్తు తిరుసభ అంతటికీ ఇచ్చాడు.