పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఏక శరీరమనే భావం ప్రాముఖ్యం

తిరుసభ క్రీస్తు శరీరమన్నాం. అనగా క్రీస్తూ మనమూ కలసి ఏకవ్యక్తిమౌతామని అర్థం అని చెప్పాం. ఇక ఈ భావం ప్రాముఖ్యమేమిటో, అది మనకు ఏలా ప్రేరణం పుట్టిస్తుందో తెలిసికొందాం.

ఉత్థాన క్రీస్తు కరుణతో మనలను తనతో ఐక్యం జేసికొంటాడు. అతడు తిరుసభ రూపంలో, అనగా మన మానవరూపంలో ఈ లోకంలో కన్పిస్తాడు. నరమాత్రులమైన మనం అతని దివ్యసత్రసాదంలో పాలుపొందుతాం. అంతేకాదు, అల్పప్రాణులమైన మనం దేవుణ్ణి ఈ లోకంలో ప్రత్యక్షం చేస్తాం. అతడే మనం, మనమే అతడు కదా! ఈలా క్రీస్తుని ఈ లోకంలో కన్పించేలా చేయడం మన అదృష్టం, మన భాగ్యం. 

కాని ఈ భాగ్యం మనకు గొప్ప బాధ్యతను గూడ తెచ్చిపెడుతుంది. మనం క్రీస్తుని లోకానికి చూపించాలి. కనుక మన ప్రవర్తనం యోగ్యంగా వుండాలి. మన తరపున మనం వళ్లు దగ్గర బెట్టుకొని నడవాలి. ఏలా?

క్రీస్తుతో ఏక వ్యక్తులమై మనం ప్రభువులాగే ఇతరులకు సేవలు చేయాలి. ఇతరులమీద పెత్తనం చెలాయించకూడదు. ఆ ప్రభువులాగే మనమూ సరళత్వమూ పేదరికమూ వినయవిధేయతలూ అలవర్చుకోవాలి. విశుద్ధంగా జీవించాలి. అతనిలాగే మనమూ నిరంతరమూ దైవరాజ్యాన్ని బోధించాలి. సంగ్రహంగా చెప్పాలంటే ఈ లోకంలో మనమూ క్రీస్తులాగే ప్రవర్తించాలి, ఆ ప్రభువు తలంపులు పలుకులు చేతలు మన తలపల్లో పలుకుల్లో చేతల్లో ప్రతిఫలించాలి. మనం నిరంతరమూ, అతనితో ఐక్యమై అతనిలా దివ్యజీవితం గడపాలి. “ఇప్పడు నేనుకాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" అన్నట్లుగా వుండాలి. కనుక మనం క్రీస్తు శరీరమై వుండడం ఓ భాగ్యమూ, ఓ బాధ్యతా కూడ. 

ఇంకా, తిరుసభ క్రీస్తు శరీరం గనుక ప్రభువు ఆ తిరుసభ అంతటా ప్రత్యక్షమై వుంటాడు. విశేషంగా తిరుసభ వాక్యబోధ చేసేపుడు, దేవద్రవ్యానుమానాలు ఇచ్చేపుడు, ఆరాధనం జరిపేపుడు ఉత్తాన క్రీస్తు సాన్నిధ్యం దానిలో బలంగా వుంటుంది.

క్రీస్తు తిరుసభకు శిరస్సు, లేక నాయకుడు. కనుక తిరుసభ వ్యక్తిగతంగాను సామూహికంగాను గూడ క్రీస్తమిూద ఆధారపడి వుండాలి. మనం స్వీయ శక్తితోగాక క్రీస్తు వరప్రసాద బలంతో పనిచేసేవాళ్లం. మనం పడిపోయినపుడల్లా ఆ ప్రభువు నెనరుతో మన పాపాలను మన్నించి మనలను మళ్లా పైకి లేపుతాడు.

క్రీస్తు శిరస్సు, మనం అవయవాలం. దేహంలోని అవయవాల్లో ఐక్యత వుంటుంది. అలాగే క్రీస్తులోకి ఐక్యమైన మనలోమనకు ఐక్యత వుండాలి. అనగా మనం సోదరప్రేమతోను .