పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సహకార భావంతోను జీవించాలి. మనలో మనకు తగాదాలూ విభేదాలూ ముఠాలూ పనికిరావు. కులం వర్గం ఆడుమగ అనే భేదభావాలు ఉండకూడదు.

క్రీస్తు ఆత్మే మనలను ఆ ప్రభువుతోను పరస్పరమూను ఐక్యం చేస్తుంది. ఈ యాత్మ వరప్రసాదం వల్లనే మనం స్వార్ణాన్ని జయిస్తాం. పాపానికి దూరంగా వుంటాం. దేవుణ్ణి ఆరాధిస్తాం. తోడివారిని అంగీకరిస్తాం. నమ్మకంతో ప్రభువు రెండవ రాకడ కొరకు వేచివుంటాం.

3. తిరుసభ ఆత్మకు ఆలయం

1. ఆత్మకు హీబ్రూ భాషలో "రువా" అనిపేరు. ఈ పదానికి గాలి, ఊపిరి, ప్రాణం అనే వివిధార్థాలున్నాయి. సృష్ణ్యాదిలో ఆత్మ ఆదిమ జలాలమీద పక్షిలా ఎగిరి ప్రాణికోటిని పుట్టించింది - ఆది 1.2. దేవుడు మట్టిముద్దలోనికి ఈ యాత్మను వూదగా అది జీవంగల ప్రాణి ఐంది. అతడే ఆదాము - ఆది 2,7. ఈ విధంగా ఆత్మ ప్రాణిసృష్టికి కర్త ఐంది.

ఈ యాత్మ నూత్న జీవానికీ నూత్న సృష్టికీ గూడ కర్త ప్రభువు బాబిలోనియా ప్రవాసంలో వున్న యూదులతో "నేను నా యాత్మను మీ విూదికి పంపి మీరు మళ్లా జీవించేలా చేస్తాను" అంటాడు - యెహె 37,14. అనగా ప్రవాసంలో చిక్కిచచ్చినవాళ్లలా వున్న యూదులకు ప్రభువు ఆత్మ నూత్నజీవాన్ని దయచేస్తుందని భావం. ఈ జీవం ఆ యాత్మడు పూర్వం ఆదాముకి దయచేసిన జీవంలాంటిది, కనుక ఇది నూత్నసృష్టి.

మెస్సీయా కాలం వచ్చినపుడు ప్రభువు నరులందరి మిూద తన ఆత్మను కుమ్మరిస్తాడని యోవేలు ప్రవక్తనుడివాడు - 2,28. ఒక్క మెస్సీయా కాలపు ప్రజలేకాక, మెస్సీయాకుగూడ ఈ యాత్మ లభిస్తుంది. ఆత్మడు మెస్సీయాకు సప్తవరాలు దయచేస్తాడు - యెష 11,2-5. ఆత్మశక్తితోనే అతడు పేదలకు సువార్తను బోధించి న్యాయాన్ని నెలకొల్పుతాడు - 61,1-2.

2. నూత్నవేదంలో యెరూషలేములోని ఆదిమ క్రైస్తవ సమాజమే మెస్సీయా ప్రజలు. మెస్సీయా వీళ్ళ నాయకుడు. కనుక ఆత్మ మొదట ఇతన్ని నడిపిస్తుంది. యెషయా చెప్పినట్లు ఆత్మ మెస్సీయా శిశువమిూదికి దిగివచ్చింది. ఆత్మశక్తి వల్లనే మరియ గర్భంతాల్చి మెస్సీయా శిశువునుకంది - లూకా 1,35, జ్ఞానస్నాన సమయంలో ఆత్మ అతనిమిూదికి పావురంలా దిగివచ్చింది - 3,22. ఇది ఆదిమ జలాలమిూద ఎగిరిన ఆత్మే ఆత్మబలంతోనే క్రీస్తు దైవరాజ్యాన్ని బోధించాడు, అద్భుతాలు చేసాడు. మరణానంతరం అతడు ఆత్మశక్తితోనే ఉత్తానమయ్యాడు - 1కొ 15,45.