పుట:Bhoojaraajiiyamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

భోజరాజీయము ఆశ్వా 6


తే.

నీవు భర్తవు గాఁదగుఁ జూవె శూద్ర!'
యనుచు వివరించి చెప్పిన యతనిమాట
విని రయంబున శూద్రుండు వికచవదనుఁ
డగుచు నయ్యంతిఁ జేపట్టె నాక్షణంబ.

29


చ.

కనుగొని యున్నమువ్వురును గామశరానలతప్తచిత్తులై
కనలుచుఁ బోటు బోల దని కాన కితం డొక కాఁపువాని కే
మని కొనిపోయి నిష్కరుణుఁడై నవపల్లవకోమలాంగిఁ గ్ర
క్కునఁ దగ నిచ్చె మానికముఁ గ్రోఁతికి నిచ్చినమూఢు కైవడిన్.

30


తే.

ఎంత చెప్పిన నావగింజంత భూతి
పూయువానికి గుమ్మడికాయయంత
వెఱ్ఱి గల వను నార్యోక్తి వినమె తొల్లి
యితని యవివేక మది వేఱె యెన్న నేల.

31


చ.

అదియునుఁ గాక పేరడవులందు మృగంబులఁ గూడియున్నపెన్
ముదుకని కెట్టు పుట్టుఁ దుదిముట్టిన నాగరికంపుఁజందముల్
వదలక తోడఁ జచ్చుట, సువర్ణము దానముసేఁత, ప్రేతరా
ట్సదనము చొచ్చి యున్నసతిఁ జయ్యనఁ దెచ్చుట యెందుఁ బోయెనో.

32


క.

మోపెడు [1]కట్టెలఁ గాల్చిన
కాపే యర్హుఁ డగునటె జగన్మోహనలీ
లాపరిచయదృగ్దీప్తి
వ్యాపారాపాంగ మైన యంగనఁ గవయన్.

33


వ.

అని కోపోద్రేకంబు సైరింపం జాలక యా పెద్ద నుద్దేశించి 'యోయీ! నీవు
మావేడ్క చెఱచితివి గావున వనితానిమిత్తమై వహ్నితప్తుండవు గ' మ్మని
బ్రాహ్మణుండును, నీదయితకు నీవు భ్రాతవు గమ్మని క్షత్రియుండును, నీ
కళత్రంబునకు నీవు పుత్రుండవు గ మ్మని వైశ్యుండును శాపంబు లిచ్చిన
నెడ సొచ్చి యాశూద్రుండు వారి కి ట్లనియె.

34


క.

'ఓహో! యిటు సేఁత గురు
ద్రోహ మగుట గాన నేరరుం గదే "కామాం

  1. కట్టెలు