పుట:Bhoojaraajiiyamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంజరుని కథ

181


ధో హి న పశ్య" త్యను పలు
కూహింపఁగ నిక్క మయ్యె నుడుగక మీచేన్.

35


తే.

ఇచట మీ రిచ్చుశాపంబు లెన్ని యైన
నాక కానిండు, సత్యవ్రతైకశీలుఁ
డితఁ డనపరాధుఁ డగు క్షమియింపుఁ' డనఁగ
నతని వారించి వారికి ట్లనియె విధుఁడు.

36


'కాముకునకుఁ, బాపకర్మున, కవివేకి,
కవనిపతికిఁ, గోపవివశమతికి,
మదవిజృంభితునకు, మద్యపాయికిఁ, గ్రూర
చేతసునకుఁ దగవు చెప్పఁ జనదు.

37


వ.

అదియునుం గాక సకలద్వంద్వంబులు విడిచి సమలోష్టకాంచనుండనై యుం
డియు మీతో భాషించినదోషం బూర కేల పోవు, నైనను మీకు నాచెప్పినట్లగుం
గదా యని వాలాయించి యడిగినప్పు డియ్యకొని యిప్పు డిటు చేఁత నా
భాగ్యంబ కాక మీ రేమి సేయుదు రోపితి రేని శాపంబులు క్రమ్మరింపుం
డంతకు శక్తులు గా రేని యూరక పొం' డనిన వారు 'తండ్రీ! వేసరినవాఁడు
వెలుంగుమీఁద వేన్నీళ్ళు చల్లినట్లు నిలు పోపక పలికితిమి గాక నిన్ను శపింప
మే మెంతవార' మని యుపదారోక్తులు పలుకుచు దుప్పి పోయిరి గాని
శాపంబులు మరలింప నోప రైరి; శూద్రుండు నతనిచేత ననుజ్ఞాతుండై
యాసతియుం చానును నిజగృహంబునకుం జనియె, మఱి కొండొకకాలంబు
సనుటయు నొక్కనాఁడు.

38


క.

ఆవనమున కొక భూపతి
భావ మలర వేఁట వోయి ప్రత్యక్షభవా
నీవిభుఁడో యన నొప్పెడు
నావంజరుఁ గాంచి నమ్రుఁడై యచ్చోటన్.

39


ఉ.

కొండొకసేపు తద్విదులగోష్ఠి సుఖింపుచు నుండి యీనృపా
లుండు మహానుభావుఁ డని లోకమువారలు చెప్ప నెప్పుడున్
విందును మున్ను నాకు నిదె నేఁడు నిదర్శన మయ్యె నన్ను నీ
తండు గృతార్థుఁ జేయఁదె ముదంబున మత్పురి కేఁగుదెంచినన్.

40