పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
66

అం 2]

భారత రమణి

ద్రోయు చున్నావు. "స్వధర్మే నిధనం శ్రేయ: అరధర్మో భయానహ:" సముద్రయాన మొనర్చిన వానికి నీ సుత నీయజనుదునా ? సంఘము నిన్ను వెలిబెట్టదా?

దేవే-- వెలి వేయనీ... ఇప్పుడు వెలియన్న అవమాన ముగా గణింపబడుట లేదు, మూదుమిక్కిలి గౌరవభ్యాజనముగ గన్పట్టుచున్నది. స్వర్గీయులగు విద్యాసాగరుడు, రామమోహనరాయలు, కేశవచంద్రసేనుల బోటి మహాపురుషులతో బాటు సంఘమునుండి బహిష్కరింపబడుట లజ్జావహము కాదు. వెలిబడినవా రెట్టివారు? అంత్యజుల సోదరభావమున అక్కున జేర్చువారు, బాలవితంతువుల దుస్దితికి వీలుపడిన గుండె కలవారు. కూటికి లేక కూతుళ్ళ పెండ్లికి కట్నము నీయ లేక వారి నవివాహితులుగ నుంచువారు, దారాపుత్రాదుల దేహపరిశ్రమచే ధనము నార్జించి దైన్యము లేని జీవిక బరువు వారు, విద్యాభ్యాసమునకు దేశోద్ధారణమునకును విదేశ యానము సేయువారు,... ఇట్టి యుత్తమకార్యముల నిర్వహింపబూనువారే కదా వెలివేయబడినవారు!... కాంహి వేశ్యాలోలురు, వ్యభిచారులు, నాలిముచ్చులు, దొంగలు, స్త్రీహత్యజేయువారు, పదిసారులు బందిగ్రాహులయినవారు, పంచమహాపాతకులు, కులసతుల కాపురముల మాపి వారికూటమి యందు కులుకు చుండెడువారు, కులహీనులచేతి కూడు తినువారు, బాహాటముగా కల్లుత్రాగువారు, జూదరులు, వేలకొద్ది నిరీహుల కొంపలకు చిచ్చుపెట్టు వారు, సజ్జనుల గొంతు