[అం 2
భారత రమణి
దేవే--నీవు నాకు ధన మీయ నక్కరలేదు. దాని కన్న విలువగల పదార్ధ మడిగెదను. నీ కుమారుని నాకిచ్చి నాకుమార్తెను నీవు కొనుము.
సదా--నీవునోరువిడిచి అడిగినది. నా చేతిలోనిది కాదు. నాకుమారుంహి వివాహము వాని ఇష్టముపై నున్నది.
దేవే--నీకుమారుని కిది సమ్మతమని నేనెరుగుదు
సదా--అట్లైన నేటి నుండియు నీకూతురు నాకోడలు.
దేవే-- ఇప్పుడు నీ వింటికేగుము. నేను మనసు దిట్టము చేసుకొనదను.
(సదానందుడు పోవును, ఉపేంద్రుడు వచును)
ఉపే-- దేవేంద్రా ! ఆ విషయమున నేమి నిశ్చయించితివి?
దేవే-- అన్నా ! సుశీలను సదానందుని తనయున కిచ్చి పెండ్లి చేసెదను. ఇక ఆ విషయమున చింత లేదు.
ఉపే--అయ్యో ! అయో ! నీకు మతి పోయినదా ఏమి?
దేవే--ఔనుకాబోలు.
ఉపే--సంఘము?
దేవే--విడిచెద.
ఉపే-- సోదరా! నీ కుమారిక యోగ క్షేమముల నారయు పూచీ నీయందున్నది. నీవు సనాతనధర్మమునువిలువ బెట్టినచో నందఱకును మేలొనగూడును. ఈ పురాతన