పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 1]

63

భారత రమణి

వనమున పారిజాతములే పూచుచుండు ననియు,సురభిస్నగ్ద మలయవనము లెప్పుడు వీచుచుండు ననియు, కోకిలలు గానము సేయుచుండు ననియు, ఎంచుచుంటిని, కాని ఇట్టి విషఫలముల నాస్వాదింపవలయునని కలనైన తలపలేదు. ఇప్పుడు సంసారమను వలలో చిక్కుకొంటిని; చిక్కులను విప్పినకొలది చిక్కము బిగియుచున్నది. తప్పించుకొను దారి తట్టుటలేదు. దరిదాపు కానరాకున్నవి. సదానందా, ఏది నెరవు?

సదా-- మొన్నొకనాడు చెప్పితినే.

దేవే--ధైర్యము చిక్కదాయె. ఏల?....ఆ! నేను పురుషుడను కానా?.... కాదు...విడెచద.... నిశ్చయించుకొంటిని. తెంచి వైచెదను.

సదా--దేనిని?

దేవే-- చేతికి చిక్కితిని కదా అని చెంపలు వాయించు చున్నది...బాధ మిక్కుట మగుచున్నది. ఇక భరించలేను.

సదా--ఏమిది దేవేంద్రా, అట్లనుచుంటివి?

దేవే-- సదానందా, నిన్నొకటియాచింతు, ఇచ్చెదవా?

సదా--ఏమి కావలయునో అడుగుము, సంకోచము వలదు. ఇన్నాళ్ళనుండి నాతో మెలగుచుల్న్నను నా నైజ మెగుగలేకుంటివి. నా సంపదలో సగమడిగినను సంసముతో ఇచ్చెద ఇదివర కొసగనందుకు హేతువిది. నీవు నన్నడుగ లేదు. ఒకసారి అడిగిచూడు.