పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

162

భారత రమణి

[అం 5


చుంటిని... అయ్యా! నాగతి ఏమి కానున్నది?

చె।కా।--చీ!చీ! పాతకీ! నీ మొగము చూడరాదు (ఫోవును)

ఉపే--నిజము-నిజము.ఇక్కడ ఏ కూలివానితో నైన మాటలాడినచొ కొంత తాపోపశమన మగునేమో! కాని ఎవ్వరును కానరారు...ఒంటరి నైతిని, జంఝామారుతము లీల, పొగబండి తెరగున, ఉప్పెన లాగున, నా మనము ప్రచండవేగమున పారొపోవ నెంచుచున్నది. ఎచ్చటికో నేనెరుగను. పరుగు మాత్రము కనబడుచున్నది. అహోరాత్రములు గానుగ త్రిప్పవలెనని యున్నది, గాని దేహమున కట్టిదార్డ్యము లెదు. పాపికి చిత్తశాంతి అలవడునా?...అబ్బా! అబ్బా! ఈ నరక మెంతని అనుభవింతును? దయామయా ఎంత కాల మీరోతను నన్ను త్రోయుదువు! అదిగో దేవేంద్రుడు తమ్ముడా! రమ్ము.

దేవే--(నమస్కరించి) అన్నా! నాతప్పు సైరింపుము.

ఉపే--నేనా! నీవు నా తప్పుల సైరింఫవలయును. నేను చేయు దుష్కృతము లన్నియు ప్రపంచప్రభలచే ఇంతవరకు ఎరుగబడకున్నను, ఈ బందియందున్న రెండు దినములలో నాకన్నులకు కట్టినట్లున్నది. ఈ చెరసాల పాపులకు పరమ పావనమగు చోటు.

(సదానందుడు కేదారుడును వచ్చెదరు)