పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 2]

155

భారత రమణి

ము కాలక్రమమున తలక్రిందు కాదా?... యజ్నేశ్వరునికి బుద్ది వచ్చునట్లు కొట్టి ఒకసారి చెఱసాలకు నేను పోయియుంటిని. నీకు బుద్దిరావలె నన్న నేవే పోవలయును. ఇపటికి నీపాపము పందుటచే నీవంతు వచ్చినది. నడువుము.(ఫోవును)

                  ---

--: రెండవ రంగము :--

(దేవేంద్రు నింటిలో సుశీలా వినయకుమారులు.)

విన--సుశీలా! పెండ్లి చేసుకో నంటివే!

సుశీ-- నాది పొరపాటు-- ఈలోకమును స్వర్గ మనుకొంటిని. కాదు, ఇది నరకము. నారీజాతిని పురుషుల కామిష రూపమున పరమేశ్వరుడు సృజించెనని ఎఱుగనైతిని.

విన-- అదెట్లు!

సుశీ--ప్రపంచమను నీ యరణ్యమున ముగ్దహరిణమువోలె స్త్రీజాతి మెలగుచుండును. అయ్యో... నారీలోకమా!.. దాస్యమొనర్చుటకె నీవు పుట్టితివి, మొదట తండ్రికి పిదప పతికి, ఆవెన్క సంతతికి! అన్యాశ్రయమే నీకు జీవిత్ పరమావధి. నీవు స్వతంత్రవు కానేరవు. ఆ శక్తి నీకులెదు, కావుననే అబలవు.

విన--శక్తి లేకెమి? పురుషుని అంధతాశక్తిని వారి లోనికి తెచ్చునది స్త్రీయేకదా!...నార్యవమానముచే కౌరవకులము సమూలము నశింపలేదా? నారీశాపప్రభావమున