పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 1]

153

భారత రమణి

యజ్నే--నే నెరుగను.

దేవే-- ఏదీ-ఇటుతెమ్ము... అయ్యో! ఇగి పోలేదా. ఆ మాట నిజమేనా! ఆహా! అర్దాంగీ! మానదా! (జార విడిచి మోము వంచును)

సదా--ఏమి దేవేంద్రా! అట్లు న్నావు!

దేవే--అయిదువేల రూపాయిలు చోరీ అంటినే, అవే యివి! సదానందా! ఎంతమూర్ఖుడ!...నాతల తిరుగుచున్నది. కన్ను చీకట్లు కమ్ముచున్నవి.

ఉపే--యజ్నెశ్వరా! నాకొంప ముంచితివి.

దేవే-- సదానందా! నన్ను లోనికి గొనిపొమ్ము. (పోవును)

యజ్నే--ఉపేంద్రా! నీ కొంప తీసినది నేనే, నీ గొంతుక కోసినది నేనె, నీకిది వింతగా తోపవచ్చును; నిజమే, చిరంతన పాషండుడ, పాపి నగునేను సర్మార్గవర్తిగా నుద్దరింప బదుట సంబవించదు. కాని ఉపేంద్రా! ఇది మాతృదేవతా ప్రసాదఫలము... ఆ నాడు.జ్ఞప్తి యున్నదా! ఏనాడు జగదంబ దెనమలిన ధూసరితముఖమున, నాకు బ్రత్యక్షమై, స్వర్గద్వారముల భేదించి, మోకరించి, చేతులు జోడించి, కన్నుల నీరు గ్రమ్మ, పీడిత సతీత్వరక్షాభిక్ష నన్ను యాచించెనో, ఆనాడే నాచిత్తము పరివర్తనము చెందెను. అత్యంత పాపినయ్యు అ నాడు నేను తరించితిని. నాకిక పాపభీతి లేదు. నీ కట్టి యాశ లేదు.