ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]
97
భారత రమణి
వేదవేదాంతుడనని-వెలయుశ్రీసర్వేశ్వర కృష్ణా ! (పోవుదురు)యజ్నే--పీడ వదిలినది...ఉపేంద్రా నీతో నొక మాట చెప్ప వచ్చితిని.
ఉపే--నేనుకూడ నీకొకమాట చెప్పవలెను.
యజ్నే--ఆహా నీవే, నన్నే-మీతండ్రి అప్పు తమ్ముని తలపై రుద్దితివి. ఇల్లమ్మి ఋణము అతడు దీర్చునని నమ్మించి తిని. ఇల్లమ్ముడైనది- అప్పరకాసైన నాకందలేదు.
ఉపే--ఇందు నాదోషమేమి?
యజ్నే--దోషము నీది కాదా? ఉండుండు. నీచెవులు నులిమి సొమ్మంతయు రాబట్టెదను.
ఉపే--కానిమ్ము నేను వకీలును, లా ఎరుగుదును.
యజ్నే--అబ్బో! అటులనా? నేను షరాబును; బీదలను పీల్చి పిప్పిచేయుట మనకిద్దరకు సహజధర్మము. నీవు మునిముచ్చువైతివి. నేనట్లుకాలేదు. ఇదే భేదము. చూడు సొమ్మంతయు నీనుండి వసూలుచేసెదను.
ఉపే--నేనీయవలసిన పైకము నంతయునీకిచ్చినట్లు రసీదు నాకిచ్చితివి. ఎక్కు వెట్లు రాబట్టెదవో చూచెదను.