పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
96

[అం 3

భారత రమణి

మున్నదో కనుడు-- 'సర్వభూత" శబ్దము "షర్బతు" గా మారినది. ఇందుచేతనే సర్వభూతములును పరమేశ్వరునియందు ఇట్లే లీనమగును.

భక్తు-- ఏమి అధ్యాత్మిక తత్వం.

ఉపే--ఇంకొకటి మిగిలియున్నది. (గుడిగుడి చూసి) ఇది పొగను సృజించురు. ఇట్లే అనేక యంత్రములు చేయగలవు. ధూమయంత్రములను చేయుటయే మానవుడు గ్రహించెను. ఇందు విష్ణుతేజ మున్నది. ఇందుజ్ఞానపత్రి యుంచి పీల్చినచో సర్వలోకములును సాక్షాత్కరించును. (పీల్సును)

(యజ్నేశ్వరుడు వచ్చును)

ఓహో! యజ్నేశ్వరా! రమ్ము.... వత్సలారా! నేను కొంత సేపు ఆత్మసాక్షాత్కార మాచరింపవలయు. మీ రిండ్లకు పొండు. ఆహా! గోపీజనమనోర్ంజనా, జీవులకు పరమావధి నీవేకదా? సర్వోధారకుడవు సర్వనియంతవు శ్రీహరి నీ చరణములె నమ్మియుంటిని.

భక్తులు--(పాడుదురు)

పా ట

నీదుచరణములే-- గతియని--ఎదనునమ్మినవారమురా! శ్రీకృష్ణా!