పుట:Bhagira Loya.djvu/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'బాపిరాజు'

యని దేవరకోటలోను సరస్వతీ మందిర మొకటి నిర్మించ దలచుకొన్నారు. జగ్గన్నమంత్రి గంటం లోంచి ప్రవహించి వచ్చిన పూర్వకవుల గ్రంథాలు రామన్నమంత్రి, జగ్గన్నమంత్రి శిష్యులైన యనేకులు వ్రాసియిచ్చిన తాళపత్రగ్రంథాలు ఆ మందిరంలో వెలిగిపోయినవి. కృష్ణానది నవ్వుకొనుచు ఉత్తరవాహినియై ప్రవహించి సముద్రుని చేరుకొన్నది.



116