పుట:Bala Neethi.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
70

బా ల నీ తి.

ధర్మరాజునకిచ్చి గదాదులను భీమార్జునులకొసంగి ధర్మరాజుచే సత్కృతుండై చనెను. ఈసభను బోలుటకు దేవేంద్రాదిసభలును గొఱగావని నారదాది మహర్షులు వచించిరి.

    కనుగొంటిరా! ఆమయునికృతజ్ఞత యెట్టిదో! మఱియు నెటుల నాయుపకారులకు మేలొనరించెనో! కావుననే యామయుడు కృతజ్ఞత యందున బ్రసిద్దిని నంది యున్నాడు. కాన మనముగూడ గృతజ్ఞతకల వారమై తిరిగి యుపకారులకు మేలొనరించుచు గృతలక్షణులమగుటకు బ్రయత్నమొనరించు చుందుము.

క.కృతమెఱింగి కర్తనుత్తమ
   మతుల సభల సంస్తుతించి♦మఱవక తగన
   త్కృతిసేయుడె కృత్మఱిగెడు
   పతియె జగజ్జనుల నెల్ల♦బరిపాలించున్

(భారతము.)

దా న ము.

    అనగా నిరతులకు ధనముగాని యుపయోగ మగు వస్తువుకాని యిచితముగా నొసంగుటయు, మఱియు నభయమిచ్చుటయు నని యెఱుగదగు.
     ఈదాన మెక్కువగాజేయువారలు వదాన్యులని చెప్పబడుడురు. సామాన్యముగా దీనులై, యకుటిల స్వభావులై