పుట:Bala Neethi.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
(8)

57

బా ల నీ తి.

ఈధీరులు మెత్తని పరుపులను, కఱకునేలలను, పంచభక్ష్యపరమాన్నములును, గందమూలఫలాహార ములును జీనిచీనాంబరములను, జీర్ణామబరములను, లాభనష్టములను, గీర్త్యపకీర్తులను, సుఖదు:ఖములను నుధ్యానవనవిహారంబును, దుర్గమకాననాంతరపరిబ్రమ ణంబును, మొదలగువానినన్నిటిని సమములుగా నెంచి సమాఅనుకూలముగా నడచుచు నితరుల మనముల నొప్పించక కార్యమూసాదించుచు లోకమునకు మేలుజెయుచుందురు. ధీరులు తాము పూనినపని కెన్నియాతంకములువచ్చినను నవియన్నియు లక్ష్యముచేయక యాకార్యమును నెఱవేర్చుకొనుచుందురు. ధైర్యము కలవాని నెట్టివిపత్తు లైన బాధింప జాలవు. లోకమున ధైర్యములేక పరుగెత్తుచుండు మబ్బులను గాలిపాఱద్రోలునుగాని ధైర్యమూనిపరుగిడక డీకొనసిద్ధముగానుండు ధరాధరముల బాఱద్రోలలేదుకదా. కాబట్టి ధైర్యవంతుని నెవరును బాదింపజాలరు. ధైర్యమవలంబించనిది యేకార్యమును జేయజాలము. చూడుడు. ఒకడు లోకోపకారము సేయనెంచి యొకమహానదినిగాంచి దీనియుదకము జనులకంద జేయవలయునను తలంపున దానికొకదరివేయ నుద్యుక్తుడాయెను. కాని యాతడు దైరవంతుడుకాకపోవుటవలన బ్రతిప్రదేశమునకువచ్చి యెడ్డుననిలువబడి యిక్కడ నెంతలోతుకలదోయని భయపడుచు దానూనినపని గొనసాగించకొనలేకపోయెను. వాడే ధీరు