పుట:Bala Neethi.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
16

బా ల నీ తి

గా నాశీర్వదించెను. ఈకవ్వడి, గురుభక్తిజూపుట ఈ సమయము నందే కాక యుత్తర గోగ్రఃహణమందుగూడ జూపెను. ఆయర్జును డుత్తరకుమారునికి, బృహన్నల,యనుమాఱుపేరుతో సారధ్యము సల్పుచు గారణాంతరమునగ్రమముగా దాను రధికుడై గాండీవాదుల ధరించి యదివఱకు బ్రచ్చన్న వేషంబుతో విరటుని కొలువునందుండుటంబట్టి ప్రతి పక్షికోటిలోనున్న గురువరునకు సమస్కారంబు జేయుటకు వీలులేక నమస్కార మాచక భాణంబుల నాగురు వరుని పాదారైందమువంకబ్రయోగించెను. అందులకాగురుడమితముగా సంతొషించెను. దాన నీకిరీటియాయుత్తరగోగ్రహణమందు జయంబత్యద్బుతంబుగా సందెను. మఱియు నీగురుభక్తివలన గలిగిన నీధనంజయుని మహిమ మఱియు నీగురుభక్తివలన గలిగిన నీధనంజయుని మహిమ మఱియెందుకలదు. అది వినుడు, భారతయుద్దాన సాసంబున బుత్త్రభూతియు, ద్రోణాచార్య తనూభవుండును, నగు నశ్వద్ధామకు నీయర్జుననౌ గలహముసంభవించెను. క్రమక్రమముగా నాకలహముప్రబలి యొకరిపైనొకరు బ్రహ్మశిరోనామ శాస్త్రంబుల బ్రయొగించుకొనిరి. అంత నక్కడనుండు మహామునులెల్ల నీకల్లోలమునుగాంచి వీరిజేరి మీయస్ద్త్రంబులు బ్రహ్మశిరోనామకబులు లోకముల దహించగలవు. కానమీయస్త్రంబుల నుపసంహరింపు డని పలికిరి. అంత వారి యనుమతిన నర్ఝునుడుమాత్రము తనయస్త్రము నుపహరించెను. అటుపై నశ్వద్ధామ తన యస్త్రము నుపసంహరింపలేక తన మాన