పుట:Bala Neethi.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

87

బా ల నీ తి.

వృతంబగు నాసభయందున జూదమాడుటకు బ్రారంభముగలవారినిగా నొనరించెను. ఆయన ధర్మరాజోడువడునట్లుగావించెను. ఆధర్మరాజుయొక్క విత్తము నపహరించి కాననమునకు సతీసోదర సమేత ముగా బంపించి కృతార్దుడనైతి" నని యానంద మందుచుండెను.ఇంతలో నాధర్మరాజూదులు తిరిగివచ్చి భండనమున నూఱుగురు తమ్ములతొ గూడ నాసుయోధనుని బరలొకగతునిగా నొనరించిరి.

 విలోకించితిరా! ఆదుర్యొధను డాధర్మరాజుచేయు రాజసూయంబును, జూచి సహనముగా నుండిన నిట్టి యిక్కట్టుల కాటపట్టుకాగలడా? కాడు. వానియందోర్వ లేని తనముండుటంబట్టియే యిప్పటికిమనవార లాదుర్యోధను ననహిఅష్ణువుగా లెక్కించుచుందురు. కాన మనమసూయకలిగి యనహిష్ణులమని యనిపిముకొనక యుండి సర్వసుఖముల బొందుటకు యత్నించుచుందము.

ఆ.వె. ఓర్వమిద్రునై న♦నూరక కష్టాల
        పాలుజేసి మిగుల♦బాధపఱచు
       గాన దాని మనము♦గైకొనంగనురాదు
       మిత్త్రులార!సచ్చ♦రిత్రుభార.!