పుట:AntuVyadhulu.djvu/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

ఏడవ ప్రకరణము


తగిన యాధారములేక నశించిపోవును.ఇట్లుగాక రోగికి రోగము కుదిరి సూక్ష్మజీవు లోడిపోవునప్పుడుకూడ సూక్ష్మజీవుల కనేక చోట్ల మరణము సంభవించుచున్నది.

ఇట్లుగాక వరిచేనునకు ఆరు నెలలనియు, నువ్వుచేనునకు మూడు నెలలనియు, కొబ్బరిచెట్టునకు ఇన్ని యేండ్లనియు, మామిడిచెట్టు కిన్ని యేండ్లనియు, ఇట్లే యొక్కొక జంతువుకును ఏప్రకారము ఆయుర్దాయమును, ముదిమియు గలవో అట్లే కొన్ని జాతుల సూక్ష్మజీవులకు యౌవనజరావస్థలును ఆయుః పరిమితియు నున్నట్లు తోచుచున్నది. టయిఫాయుడు సూక్ష్మజీవులు ఒకటి రెండు వారములలో విజృంభించి నాలుగు వారములలో చాలభాగము నశించి పోవును. మశూచకపు సూక్ష్మజీవులు 10 లేక 15 దినములలో తమ యుద్రేకమును పోగొట్టు కొనును. కొన్ని సూక్ష్మజీవులు కొంతకాలము విజృంభించిన తరువాత తమ స్వభావమును మార్చుకొని గ్రుడ్లుగా నగును. ఈ గ్రుడ్లకు సాధారణముగా జీవితకాల మింతింతని లేదు. ఒకా నొకప్పుడు మితిలేకుండ చాలకాలము పడియుండి యెప్పుడు తగిన తరుణము వచ్చునో అప్పుడుమొలకరించును. క్షయ, దొమ్మ మొదలగుకొన్ని వ్యాధుల సూక్ష్మజీవుల గ్రుడ్లిట్లు పడియుండి యోకానొకప్పు డకస్మత్తుగ ప్రబలి హాని కలుగజేయును.

సూక్ష్మ జీవులన్నియు గుంపులు గుంపులుగా పెరిగి సామాన్యముగా గుంపులుగానే చచ్చును. వీనిపెంపు పూవుల