పుట:AntuVyadhulu.djvu/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

157

నశించి పోవును. ఇట్లు క్వయినాను పుచ్చుకొని సంవత్సరముల కొలది గడు మన్య ప్రదేశములలో చలి జ్వరమును జయించిన వారు గలరు. ఇందు వలన శరీరమున కేమియు చెరుపు లేదు. మన దేశమునందలి ప్రజలకు క్వయినా యెడల గల ద్వేషము పోయిన గాని చలిజ్వరము మనల నింతట విడువదని చెప్పవచ్చును.

2.క్వయినా యొక్క సామయ్మును కోరక యృ చలి జ్వరమును నివారించు పద్ధతులు.

1. ఈ జ్వరమును వ్యాపింప జేయు అనాఫలీసు దోమలను నశింప జేయుట. దోమలు అధిముగా గల ప్రదేశములలో ఎగురుచుండగా వానిని పట్టి చంపుటకు మన మనేక పటాలములను పెట్టినను వానితో మనము పోరలేము. కాని యీదోమలకు తమ పిల్లలను పెట్టు కొనుటకు తగిన చోటు లేకుండ మనము చేయ గలిగిన యెడల ఇవి యొక తరముతోనే నశించి పోవును. దోమలు తమ గ్రుడ్లను అరంగుళము లోతునకు తక్కువ కానట్టియు, ఒక చోట నిలకడగ నుండు నట్టియు నీటిలో పెట్టును. పొడి నేలయందు గాని ప్రవహించు నీటి యందు గాని ఇవి తమ పిల్లలను పెట్టవు. 37.వ.పటము చూడుము.

కావున గ్రామము నందును, గ్రామమునకు చుట్టు ప్రక్కలనుండు ప్రదేశము లందును దోమ పిల్లలు నివాసము