Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

జెప్పుకొన్నాఁడు:-

మాళవి

అన్నియు నాయందె కంటి నన్నిటివాఁడా నేనె ! మున్నె నా భావముతో ముడిచివేసినది ||పల్లవి||

చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి ! ములిఁగి ముక్తి దలంచి ముక్తుండనైతి ! పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి ! చెలఁగి శ్రీపతి శ్రీవైష్ణువుఁడ నైతి ||అన్ని|| 1

పొసంగఁ బుణ్యము సేసి పుణ్యాత్ముఁడనైతి ! పసలఁ బాపము సేసి పాపకర్ముఁడనైతి ! వెసబ్రహ్మచారినైతి వేఱే యాచారమున ! ముసిఁగి మఱొకాచారమున సన్యాసినైతి ||అన్ని|| 2

వొగి నొడ్జె భాషలాడి వొడ్జెవాఁడ నైతిని ! తెగి తెలుంగాడ నేర్చి తెలుఁగు వాఁడనైతి ! అగడై శ్రీవెంకటేశ అన్నియు విడిచి నేను ! తగు నీదాసుండనై దాసరినైతి ||అన్ని || 3

అన్న. అధ్యా, 266 ఱేకు.

విజయనగరరాజ్య ప్రధానరాజధాని విజయనగరమే అయినను నరసింహరాయఁ డందు స్థిరవాసముచేయలేదేమో ! రాజ్యసర్వస్వాక్రమణా నంతరమో తత్పూర్వమో కొన్నాళ్ళాతఁడు గొప్పదుర్గమగు పెనుగొండలోఁ గూడ నుండెను గాఁబోలును. అన్నమాచార్యునిఁ బెనుగొండకు రావించుకొని సంకీర్తనములు వినిపింపవేఁడెను.

అన్నమయపాడుట

తేనెలపై తేట తిన్నని చెఱకు పానకముల నేరుపణిచిన మేలు