పుట:Annamacharya Charitra Peetika.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 జెప్పకొన్నాఁడు: మాళవి అన్నియు నాయందె కంటి నన్నిటివాఁడా నేనె ! మున్నె నా భావముతో ముడిచివేసినది ||పల్లవి| చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి | ములిఁగి ముక్తి దలంచి ముక్తుండనైతి | పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి! చెలఁగి శ్రీపతి శ్రీవైష్ణువుఁడ నైతి |అన్ని 1 పొసంగఁ బుణ్యము సేసి పుణ్యాత్ముఁడనైతి! పసలఁ బాపము సేసి పాపకర్ముఁడనైతి వెసబ్రహ్మచారినైతి వేతే యాచారమున ముసిఁగి మజొకాచారమున సన్యాసినైతి |అన్ని 2 వొగి నొడ్జె భాషలాడి వొడ్జెవాఁడ నైతిని తెగి తెలుంగాడ నేర్చి తెలుఁగు వాఁడనైతి! అగడై శ్రీవెంకటేశ అన్నియు విడిచి నేను ! తగు నీదాసుండనై దాసరినైతి |అన్ని 3 అన్న అధ్యా, 266 జేకు. విజయనగరరాజ్య ప్రధానరాజధాని విజయనగరమే అయినను నరసింహరాయఁ డందు స్థిరవాసముచేయలేదేమో ! రాజ్యసర్వస్వాక్రమణా నంతరమో తత్పూర్వమో కొన్నాళ్ళాతఁడు గొప్పదుర్గమగుపెనుగొండలోఁ గూడ నుండెను గాఁబోలును. అన్నమాచార్యునిఁ బెనుగొండకు రావించుకొని సంకీర్తనములు వినిపింపవేఁడెను. అన్నమయుపాడుట తేనెలపై తేట తిన్నని చెఱకు పానకముల నేరుపణిచిన మేలు