పుట:Andrulasangikach025988mbp.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       'చేతిలో వెన్నముద్ద చెంగల్వపూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి
        సందిటి తాయెతుల్ సరిమువ్వ గజ్జెలు చిన్న కృష్ణమ్మ నిన్ను నే జేరికొలుతు'

పై పద్యములో మొదటి మూడు పంక్తులు సీన పద్య పంక్తులు. తుదిగీటు తేటగిత, ఇద్దరు భిన్న ప్రాంత వ్యక్తులు నా కీ పద్య మంతేయని చెప్పిరి. తప్పో ఒప్పో ఈ పద్యమే తెనుగు దేశమందు బహుప్రాంతములలో ప్రచారమం దుండెనన్నమాట.

పల్లెటూళ్ళలో "లేహాలు, బస్పాలు, సూర్నాలు, తైలాలు" దొంగ వైద్యులు అమ్ముకొని జనులను మోసగించేవారు. ఇప్పటికినీ ఈ పని జరుగుతూనే ఉన్నది. నాటు వైద్యుల మోసాలను ఈ కవి చక్కగా వర్ణించినాడు.

హంసవింశతిని రచించిన అయ్యలరాజు నారాయణా మాత్యుడు క్రీ.శ. 1800-1850 ప్రాంతమువాడు. అతని గ్రంథ మా కాలములోని జనుల ఆచార వ్యవహారములను తెలుపునట్టి ఒక గని. అతడు కర్నూలు మండలము వాడందురు. గ్రంథాంతములో అతడు కందనూలు, గద్వాల, పాలవేకరి, రామళ్ళకోట, నెల్లూరు, కంభము, మార్కాపురము, వినుకొండ మొదలయిన తెనుగు సీమలోని స్థలాలను పేర్కొన్నాడు. ఆ ప్రాంతాలలోని జనుల ఆచారాలను కవి యెక్కువగా గమనించిన ట్లూహింపవచ్చును. హంస వింశతి నుండి మనకు తెలియవచ్చు కొన్ని విషయములను ఇందుదాహరింతును. తెనుగు దేశములో చాలా నాడులు ఏర్పడెను. అందు కొన్నింటిని ఈ కవి యిట్లు తెలిపినాడు.

        క. వెలనాడు వేంగినాడును పులుగులనా డ్పాకనాడు పొత్తపినాడున్
           కలమురికినాడు రేనా డలయక కనుగొంటి నచటియబలల గంటిన్.

చెన్నపట్టణము, బందరు మంచి వ్యాపార స్థలాలని కవి తెలిపినాడు. గుల్బార్గాలో జంఖాణాలు, బందరులో చీటిబట్టలు, అస్తరులు సిద్ధమగు చుండెనని కవి తెలిపినాడు.

నారాయణకవినాటి కాలములో కొన్ని కులాల ఆచారాలు వ్యక్తమగు చున్నవి.

         "కాపు గుబ్బెత లెసటికై కుండలరయ" (1-137)