'హుణా: కరుణాహీనా: తృణవబ్రహ్మణగణం న గణయంతి
తేషాం దోషా: పారేవాచం యే నా చరంతి శౌచమపి'
ఇంగ్లీషువారిలో కరుణయే కానరాదు. బ్రాహ్మణులనైతే వారు గడ్డి పోచలవలె చులకనగా చూతురు. వారిదోషాలు చెప్ప నలవికావు. వారు శౌచము నైనా చేయరు, అని పై శ్లోకభావము. ఇప్పటికినీ ఇంగ్లీషు వారును తక్కిన తెల్లవారును కాలకృత్యముల తీర్చుకొన్న తర్వాత జల ప్రక్షాళనము చేసుకొనువారు కారు.
"శౌచత్యాగిషు హూణకాదిషు
ధనం శిష్టేమ న క్లిష్టతాం'
అని మరొకమారు కవి తెలిపినాడు.
అట్టి శౌచరహితులగు ఇంగ్లీషువారికి సంపన్నత నిచ్చిన హతవిధిని అతడు దూరినాడు.
ఇక ఇంగ్లీషు వారిలోని మంచిగుణాల నిట్లు వర్ణించినాడు.
'ఈ హూణులు పరులసొత్తులను కోరిక, అబద్దములాడక, అద్బుతములగు వస్తువులను సిద్దముచేసి అమ్ముకొనువారు. తప్పుచేసిన వారిని విచారించి శిక్షిస్తున్నారు."
అయితే వెంకటాధ్వరి యీ కాలములో ఉండి నట్లయితే తమ సామ్రాజ్య స్థిరతకై ప్రచారముచేయు వీరిని 'పరులసొత్తులను అన్యాయముగా బలాత్కరించి వీరు తీసుకొనరు; అబద్ధాలు ఆడరు" అని వ్రాసియుండడు.
అడిదము సూరకవి క్రీ.శ. 1750 లోపలివాడని అందురు. అతని కాలములో ఫ్రెంచివారు, ఇంగ్లీషు వారు, తురకలు దేశమందు అల్లకల్లోలములు చేసిరని కవి యిట్లు చాటువును రచించెను.
"పచ్చిమాంసము కల్లు భక్షించి మత్తెక్కి
రాణించి తిరుగు పరాసులైన
గంజాయి గుండ హుక్కాలుడికెడి నీళ్ళు
త్రాగిమ్రాన్పడెడు తురుష్కులైన