పుట:Andrulasangikach025988mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజీయములో అడుగడుగునకు బ్రాహ్మణప్రభావగర్బిత కథలే బగుళముగా అల్లబడినవి.

ఈ విధమగు ప్రచార మట్లుండ యథార్థముగా బ్రాహ్మణులందే వేదశాస్త్ర విద్యలు కేంద్రీకృతమై యుండెను. షోడశకర్మలకు, వ్రతాలకు, శుభాశుభములకు అన్నింటికిని బ్రాహ్మణుడే యాధార భూతుడు. నిన్న మొన్నటి వరకు కూడా బ్రహ్మణేతరులకు వేదవేదాంగములు చెప్పుటకు సహింపని బ్రాహ్మణు లుండినప్పుడు ఆ కాలమున లేకుండిరా ? అట్టివారుండిన సర్వజ్ఞ సింగడు, సర్వజ్ఞ చక్రవర్తి, కోమటి వేమడు ఎట్లు బిరుదాంచితులైరి ? రాజులు పైనియమాని కపవాదపాత్రులై యుండిరేమో ? ఎటులైన నేమి శ్రుతిస్మృతి పురాణ శాస్త్రాదుల కంతకును విశేషముగా బ్రాహ్మణులే నిధులై యుండిరి. తెనుగులోనికి పురాణములు పూర్తిగా రానందున ప్రజలకు పురాణశ్రవణము చేయువారు బ్రాహ్మణులే. కావున పురాణముల ద్వారా ప్రచార మత్యంత ముఖ్యమని వారెరిగినవారే ! పలనాటి బాలచంద్రుని తల్లి విప్రుల బిలిపించి భారత రామాయణ పురాణములను వినుమని కుమారునికి బోధించియుండెను.

         ".........వీనుల కెల్ల తేనియల్
          చినుక పురాణ వాక్యములు
          చెప్పెడు విప్రుని జూచి, యిమ్మహా
          జనసభ జేరి"[1]

అనుటచే బ్రాహ్మణులు పురాణములు చెప్పగా జనులు తండోపతండములుగా (మహాజనసభగా) కూడుచుండిరని ద్యోతకమగును.

ఇట్టి విశిష్టతలచేత విప్రులు అప్పటి రాజులకు మంత్రులై, సేనానులై, విద్యాధికారులై, దీక్షాగురువులై, బోధకులై, పురోహితులై తమ యగ్రస్థానమును స్థిరీకరించుకొనిరి. రెడ్ల చరిత్రలో బ్రాహ్మణ భక్తి ఒక అపూర్వ విచిత్రఘట్టము. అది 'నభూతో నభవిష్యతి అని యనిపించు కొన్నది.

రెడ్లు రాజ్యానికి రాకపూర్వముండిన బ్రాహ్మణుల స్థితి వారి కాలమందెట్లు మారెనో శ్రీనాథు డిట్లన్నాడు.

  1. సింహాసనద్వాత్రింశిక, 2 భా. పు 2