డని చెప్పవచ్చును. అయినను వేంగడము (తిరుపతి) లోనుండు వేంగడ నాధుని సందర్శించినవాడనని చెప్పుకొనియుండుటచేత మతసహనము వహించిన వాడని వ్యక్తమగుచున్నది.
అల్లుర తిరుకాళత్తి దేవరాజు
ఇతని శాసనములు కొన్ని నెల్లూరుసీమలో గానిపించుచున్నవిగాని, ఇతడు స్వతం్రతుడుగాక తెలుగుచోట రాజుల క్రింద సామంతుడుగనుండినటుల ఊహింపదగియున్నది. ఈ తిక్కరాజు పల్లవుడని గండవరము గ్రామములోని శాసనములవలన తెలియుచున్నది కావున, ఇతనికిని మనుమసిద్ధిరాజు తండ్రియగు చోడుతిక్కరాజునకు ఏ విధమైన సంబంధము లేదు. ఇతడు దేవస్థానములకును, బ్రాహ్మణులకును, అగ్రహారములు భూదానములు మొదలగునవి చేసియుండెను. ఇతడు క్రీ.శ.1182వ సంవత్సరప్రాంతముననున్నవాడు. ఆ కాలముననే కడప మండలములో సిద్ధనదేవమహారాజు పరిపాలనముచేయుచుండెనని కడపమండలములోని చింతలపుత్తూరు శాసనమువలన తెలియుచున్నది.
అభిదేవ మలిదేవమహారాజు
ఈ పల్లవరాజును తాను పల్లవుడననియు, భారద్వాజగోత్రుడననియు, ముక్కంటికారువెట్టి వంశజుడననియు, కామకోట్యంబిక భక్తుండననియు చెప్పుకొని యుండుటచేత ఇతడును బైపల్లవరాజు వంశములోనివాడనియే చెప్పదగును. ఇతను క్రీ.శ.1218-19వ సంవత్సర ప్రాంతముననున్నవాడు. ఇతడును దైవతాభక్తియు,బ్రాహ్మణభక్తియుగలిగి యనేకాగ్రహారములను దానము చేసియున్నాడు.
ఇమ్మడిదేవమహారాజు
ఇతడును శ్రీశైలమునకు తూర్పుదేశమున డెబ్బదియగ్రహారములను నిర్మించిన ముక్కంటికాడువెట్టియొక్క వంశజుడని పైవారి వలెనే పెక్కు బిరుదములను వహించియుండెను. తన తండ్రి భీమరాజునకును,తల్లి సిరియాదేవికిని, పుణ్యమునకై నాగలావరముననందు చెన్నకేశవపెరుమాళ్ళను ప్రతిష్ఠచేసి