పుట:Andhrula Charitramu Part-1.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మాధారి పుత్ర శకసేనుడు.

(క్రీ.శ.180)

ఈతడు పశ్చిమాంధ్ర దేశమగు మహారాష్ట్రదేశమును బరిపాలనము చేసినట్లు గనంబడుచున్నది గాని పూర్వాంధ్ర దేశమున బరిపాలనము చేసినట్లుగానరాదు. కోల్హాపుర నాణెములయందును కన్హేరి శాసనము నందును వీని పేరు గానంబడుచున్నది. కొన్ని నాణెములయందొక ప్రక్క గోతమిపుత్రుని పేరును మఱియొక ప్రక్కను మాధారిపుత్త్రుని పేరును గన్పట్టుచుండుటచేత గోతమిపుత్త్ర యజ్ఞశ్రీ శాతకర్ణికంటె ముందుగ మాధారి పుత్తుడె రాజ్యపాలనము చేసెనని రివరెండు థామస్ గారు తలంచుచున్నారు గాని మాధారిపుత్రుడే వెనుకనున్నట్టు నాణెములయొక్క ముద్రణమె చాటుచున్నదని భాండార్కరుగారు నుడువుచున్నారు. మఱియును భాండార్కరుగారు మాధారిపుత్త్రుడు గోతమిపుత్త్రుని శాఖలోని వాడు కాడనియు మఱియొక కల్పితమైన శాఖలోని వాడయియుండుననియుగూడ వ్రాయుచున్నారు. వీని కాలమున కోల్హాపుర మండలమున శివలకురుడను వాడు రాజప్రతినిధిగనుండెను.

విజయశ్రీ శాతకర్ణి.

కలహములచే నంతరించి పోయినది.

(క్రీ.శ.202 మొదలుకొని క్రీ.శ.208 వఱకు)

ఈ విజయశ్రీ శాతకర్ణికాలమున విజయవాడ పట్టణము గట్టబడినదిగ నూహింపబడుచున్నది.

చంద్రశ్రీ శాతకర్ణి.

(క్రీ.శ.208 మొదలుకొని క్రీ.శ.211 వఱకు)

వీని పేరుగల సీసపు నాణెములు గొన్ని గానంబడినవి.

పులమావి.

(క్రీ.శ.211 మొదలుకొని క్రీ.శ.218 వఱకు)

ఈ పై నుదాహరింపబడిన యాంధ్రరాజులనుగూర్చి మన కేమియును