పుట:Andhraveerulupar025958mbp.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తో బూజించుటకంటె నా యనఘుని యాచరణముల నాదర్శముగా దీసికొనుటయే మనభావ్యభివృద్ధికి హేతువు.

________

అనపోతనాయడు

ఇత డప్రతిమానశూరుడై యాంధ్రదేశములోని చాలభాగము మిగుల బరాక్రమముతో బాలించి విఖ్యాతి గాంచెను. శూరవర్యుడగు నీమహానుభావుని జీవితచరిత్రము పఠనీయమనుటలో సందియము లేదు. కాకతీయ వంశాలంకారుడగు ప్రతాపరుద్ర చక్రవర్తి యోరుగల్లు రాజ్యము పాలించుతఱి సింగమనాయడు సేనానాయకుడై ప్రతిఘటించిన సామంతరాజుల దర్పమడంచి యాంధ్రసామ్రాజ్యమును నిష్కంటకము గావించి స్వామిభక్తి వెల్లడించెను. ప్రతాపరుద్రచక్రవర్తి యవనులచే బంధితుడైన పిమ్మట నాంధ్ర సేనానాయకు లంద ఱాంధ్రసామ్రాజ్యమును విచ్చలవిడిగా బంచుకొని పాలించుచుండిరి. నిజాము దేశములోని యాంధ్రదేశము నాసమయమున సింగమనాయ డాక్రమించుకొనెను. ప్రస్తుత కధానాయకు డీశూరుని పుత్రుడె. ఇతడు రేచెర్ల గోత్రీయుడు. వెలమకుల భూషణుడు. ఈవీరుని చరిత్రమును దెలిసికొందము.