8
ఆంధ్రనాటక పద్యపఠనం
మునకు జేరిన భమిడిపాటి కామేశ్వరరావుగారు సంగీతముపై దండ యాత్రకు నాయకత్వము వహించిరి. హృదయరంజకమగు వాదప్రతి వాదము జరిగినది.
కామేశ్వరరావుగారు తమ వాదమును స్పష్టముగాచెప్పిరి. గ్రంథ మునే రచించి తెచ్చిరి. సారాంశ మింతియే. నాటక మభినయప్రధా నము. పదార్థసముపేతంబగు గద్యపద్యాత్మకము. సంగీతము స్వర ప్రధానము. పదార్థసముపేతము కానక్కరలేదు. పదసంబంధముగల చోటంగూడ నర్ధవైశేష్యము నుల్లంఘించునదియ కావున నీ రెంటికిని నిశ్చయమగు సంబంధము లేదు సరిగదా, సత్యమునకు వైరుధ్యము కూడ గలదు.
సంగీతవిద్యను నిరసించుట యీ విమర్శకు నుద్దేశముకాదు, సంగీతము పరమానంద సందాయకము. ఆత్మాకర్షకము. కళలలో నయ్యది యుత్తమోత్తమము. సర్వజన సమాదరణీయము. సర్వజన సమాదృతము.
కాని నాటకకళ వేరు; సంగీతము వేరు. రెండును ప్రత్యేక వ్యక్తిత్వము కలవి. రెంటికిని నుద్దేశము వేరు. ఒండొంటితో వీనిని మిశ్రమమొనర్చుటచేత నిందులో నొక్కటియగు నాటకకళ నశించు చున్నది, సంగీతమే నిల్చుచున్నది. అయిన దీనికింగూడ సహజశీలము పోషితమగుటలేదు. సంకరజన్మ సాక్షాత్కరించుచున్నది. సత్యమగు సంగీతమునకు తలవంపులగుచున్నవి.
శృతి సంగీతమునకు బునాది. శృతి బెట్టుటతో సంగీత మారంభ మగుచున్నది. మితి బెట్టిన నిలుచు ప్రకృతి సంగీతమునకు లేదు. కాబట్టి నాటకశాలలో శృతి బెట్టుటయుంగూడ తగదు. పద్యమైనను గద్యమైనను శృతిబెట్టక చదివి యభినయవైదగ్ధ్యముచే నర్థవిస్ఫురణము