Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాతిపదిక

9

పరిపూర్తిచేసి చూపరులయందు భావోద్రేక, భావోన్మత్తతలను విజృంభింపజేయుట నాటోకోద్దేశము.

కామేశ్వరరావుగా రింకను విపుల విమర్శ గావించిరి. సంగీతము నకు ప్రాముఖ్యము కలుగుటవలన సంఘమునకు సంప్రాప్తించిన కష్ట ములను - భారతప్రపంచము వీనినన్నిటిని ననుభవించుచునే యున్నది- విశదపరచిరి.

ఎదురువాదము బలవత్తముగా వచ్చినదనుటకు గాదు. సంగీ తము లేకున్న పద్యమే సృష్టింపరాదని కొంద రనిరి. ఉమ్రేఆలీషా కవిగారు నాటకము అభినయము, సంగీతము, కవిత్వము ఇత్యాదికళల సమీపకరణముగాని యేకకళ కాదనిరి. ఈ సమీకరణంబున జేరిన యొక్కొక్క కండను నొక్కొక్కరి యభిప్రాయానుసారము దీసి వైచుచు వచ్చినచో నాటకప్రదర్శన మాకాశంగగనంశూన్యం అగు ననియు నాటకశాలలు తగులబెట్టుకొని పోవచ్చుననియు నెదుటి వాదము నాభాసము గావింపజూచిరి.

సంగీతము మానవహృదయమందే కలదు. సంగీతము ననుభవింప లేని మానవు డాయింగ్లీషు కవివరుడు షేకుస్పియ రనినరీతిని నిజముగా గార్దభ చక్రవర్తియే. పద్యమునందు సంగీత మిమిడియున్న దనుటయు సత్యంబె. నాటకము కొన్నికళ లుపాంగములుగా గలదనుటయు నిర్వి వాదంబె. ఇన్ని యంగీకరించిననుగూడ కామేశ్వరరావుగారి వాద మును నర్థము చేసికొనక పోవుటమాత్రము సత్య మెదురుపడినప్పుడు కన్నులు మూసికొనుటయే యగును.

మానవహృదయములోని సంగీతమును పద్యములలోని సంగీత మును సుప్రసిద్ధమై త్యాగయ్యగారి కృతులలోను నితర గాయకుల జావళులలోను స్వరప్రస్తారప్రాధాన్యమై చెన్నలరారు నంగీతకళతో