పుట:AndhraRachaitaluVol1.djvu/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేమ యను రతనాల, కొమ్ము !
తొడవులుగ నవి మేన తాల్చుట
యెటుల నంటివొ, తాల్చి తదె, నా
కంట చూడుము ! నతులసౌ రను
కమల వనముకు పతులప్రేమయె
వేవెలుగు!
     ప్రేమ కలుగక బ్రతుకు చీకటి!


కవిత్వము రసికాధికారులకే కాక సాధారణులకు గూడ నుపకరింప వలయునని తలపు అప్పారావు పంతులుగారిలో నుండి వ్యవహారభాషలో నెన్నో గీతములు వారిచే వ్రాయించినది. వీరి 'నీలగిరి పాటలు' ప్రసిద్ధిలోనికి వచ్చినవి. వీరి పాటలు నాటకములు సంఘసంస్కారమున కుపయుక్త మగునటులు వ్రాయబడినవి. చాటుమాటులు లేకుండ సూటిగా అప్పారావుగారు చెప్పదలచిన విషయమును చెప్పగలరు. ఆయన పాటలతో గంటె "కన్యాశుల్కనాటకము" తో నమృతకీర్తి యైనటులు భావించెదము.


విజయనగర కళాశాలో పన్యాసకులు గాను, ఎస్టేటు ఎపిగ్రాఫిస్టుగాను, శ్రీమదానందగజపతి ప్రాణప్రాణముగాను, తెలుగుదేశములో నాదర్శవ్యక్తిగాను, నాటకకర్తగాను విస్మరింపరాని మహోదయులు అప్పారావుగారు.