పుట:AndhraRachaitaluVol1.djvu/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తులలేని త్రిభువన దుర్లభ సౌందర్య

విభవంబు గలదన్న వేడ్క గాదు

వివిధ విభ్రమ కళా విష్కృతాత్యద్భుత

చాతుర్యవతి యను ప్రీతిగాదు


ప్రేమతత్త్వజ్ఞడైన శ్రీరామమూర్తి

సీతయెడ నట్టి కూరిమి సేత యరయ

ధర్మసతి యంతరంగంబు మర్మ మెఱిగి

కాని, వేఱొండు కతమున గాదు నూవె!


రామమూర్తిశాస్త్రిగారికి 1944లో సప్తతి పూర్తి మహోత్సవసన్మానము గావింప బడినది. ఆసందర్భమున శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు వ్రాసిన పద్యములలో నీక్రిందివి పారాయణము చేయదగినవి.


మ. ఇతడస్మత్కులు డంతె, శిష్యగణమందేవాడునుం గాడు, తి

ర్పతితోపాటు కవిత్వపున్ రచనలో భాగస్థు, డేతస్మహా

మతిసోదర్యుడొకండు శిష్యుడగుట న్మన్నించి దీవింప న

ర్హత నా కున్నది, వృద్ధు డీత డగుతున్ భ్రాజిష్టుడున్ జిష్ణుడున్.


చ. తిరుపతి శాస్త్రి దక్క గణుతింపని నే నితనిన్ గణించి మా

విరచన నున్న భాగవతవీధిని జోటు నొసంగినట్లు ధీ

వరమణు లెల్లవా రెఱుగు వారలె, వా కొననేల! దీనికిన్

దిరుపతిగూడ నొప్పుకొనె దేవునిసైత మతండు మెచ్చునే?


చ. తిరుపతి యొండె వెంకనయొ తెల్గొనరింపక దంటకూడదు

స్తరమని యెంచి వేఱొక భిషక్కునకున్ స్థలమీరు, రామమూ

ర్తి రసికు డౌటచే నతని తేకువ తా గ్రహియించి వేంకటే

శ్వరుడిడె జోటు తిర్పతియు సమ్మతి జూపె యథార్థమింతియే.